|
2011 వన్డే వరల్డ్కప్
సొంతగడ్డపై జరిగిన 2011 వన్డే వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్ అద్భుతమైన ఫామ్ని ప్రదర్శించాడు. ఈ వరల్డ్కప్లో మొత్తం 362 పరుగులు(ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు) చేసి మ్యాన్ ఆఫ్ ద టోర్నీ అవార్డుని సైతం దక్కించుకున్నాడు. టోర్నీలో భాగంగా మొత్తం 9 మ్యాచ్లాడిన యువరాజ్ 90 యావరేజితో పరుగులు సాధించడం విశేషం. అంతేకాదు ఈ టోర్నీలో యువరాజ్ 15 వికెట్లు కూడా పడగొట్టాడు.
|
2007 టీ20 వరల్డ్కప్
యువీ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది ఆరు సిక్సర్లు. ఈ ఆరు సిక్సర్లను ఈ టీ20 వరల్డ్ కప్లోనే యువీ సాధించాడు. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్కప్లో ఇంగ్లాండ్పై యువరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. డర్బన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది క్రికెట్ ప్రపంచాన్ని అవాక్కయేలా చేశాడు. కేవలం 12 బంతుల్లోనే అంతర్జాతీయ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు.
|
మూడు వరల్డ్కప్లు గెలిచిన జట్టులో సభ్యుడిగా
ఐసీసీ నిర్వహించే మూడు వరల్డ్ కప్ల్లో సభ్యుడిగా ఉన్న ఏకైక భారత ఆటగాడు యువరాజ్ సింగే కావడం విశేషం. 2000లో ఐసీసీ నిర్వహించిన అండర్-19 వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలవడంలో యువరాజ్ కీలకాపత్ర పోషించాడు. ఆ తర్వాత జాతీయ జట్టుకు ఎంపికైన యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్లో అంచనాలకు మించి భారత అభిమానుల మనసు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
|
ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్లలో యువీ పాత్ర
భారత క్రికెట్ జట్టు సాధించిన ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్లలో యువరాజ్ తన బ్యాట్ తో ముఖ్య పాత్ర పోషించాడు. 2011 ప్రపంచకప్ విజయంలో యువరాజ్ పాత్ర అపూర్వమైనది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన విజయంతో యువరాజ్ మెరిశాడు.
|
నాట్ వెస్ట్ సిరిస్ ఫైనల్లో
లార్డ్స్ వేదికగా జరిగిన నాట్ వెస్ట్ సిరిస్ ఫైనల్లో యువరాజ్ ఆట భారత క్రికెట్ను కొత్త హైట్స్కు తీసుకెళ్లింది. 2003 ప్రపంచకప్లో పాక్పై విజయంలో యువరాజ్ ఫినిషింగ్ టచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలా చెబుతూ పోతే.. టీమిండియా విజయంలో యువరాజ్ కీలక పాత్ర పోషించిన మ్యాచ్ లు, ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి.
క్యాన్సర్ను జయించిన తీరు
ఏప్రిల్ 2, 2011న యువీకి క్యాన్సర్ ఉందని గుర్తించారు. శస్త్రచికిత్స అవసరం లేదనడంతో ఊపిరి పీల్చుకున్న యువరాజ్ సింగ్కు మూడు దశలుగా కీమోథెరపీ చికిత్స అందించారు. ఈ విధంగా యువీ క్యాన్సర్ను జయించాడు. క్యాన్సర్ను జయించిన అనంతరం క్యాన్సర్ బాధితులకు అండగా నిలవాలని యువరాజ్ అనుకున్నాడు. ఇందులో భాగంగా ‘యువీకెన్' పేరుతో ఒక ఫౌండేషన్ స్థాపించి.. దాని ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తున్నాడు.