|
అర్జున్కు తీరని అన్యాయం..
కానీ ముంబై మేనేజ్మెంట్ మాత్రం ఇద్దరు రెగ్యూలర్ స్పిన్నర్లను పక్కనపెట్టి బెంచ్పై కూర్చున్న మయాంక్ మార్కండే, సంజయ్ యాదవ్లకు అవకాశం కల్పించింది. దాంతో అర్జున్ అరంగేట్రం ఊహించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. దాంతో ముంబై సారథి రోహిత్ శర్మపై ఫ్యాన్స్ తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. జట్టులో ప్రతీ ఒక్కరికి అవకాశం ఇస్తున్న ముంబై మేనేజ్మెంట్.. అర్జున్ టెండూల్కర్ను పట్టించుకోకపోవడం దారుణమని కామెంట్ చేస్తున్నారు. అర్జున్ టెండూల్కర్ ఇంత పనికిరానివాడా? అని మండిపడుతున్నారు. ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ ట్యాగ్ ట్విటర్లో ట్రెండింగ్గా మారింది.
|
సచిన్ కుమారుడికి కనీస గౌరవం లేదు..
'అర్జున్ టెండూల్కర్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే అతని అరంగేట్రం కోసం ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్లుగా జట్టుతో ఉన్న అతనికి అవకాశం ఇవ్వకపోవడం దారుణమని మరికొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్కు కనీస గౌరవం కూడా ముంబై ఇండియన్స్ ఇవ్వడం లేదని, అర్జున్ టెండూల్కర్ను ట్రీట్ చేస్తున్న విధానం నచ్చడం లేదని మండిపడుతున్నారు. ముంబై కాకుండా మరే ఏ జట్టుకు ఆడినా అర్జున్కు రెండు మ్యాచ్లు ఆడే అవకాశం దక్కేదని కామెంట్ చేస్తున్నారు. ముంబై సెలెక్టర్లకు బుద్దిలేదని కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
|
చివరి మ్యాచ్లో చాన్స్..
ఇక లీగ్లో మిగిలిన చివరి మ్యాచ్లో కూడా యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తామని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఈ లెక్కన అర్జున్ టెండూల్కర్కు ఢిల్లీతో జరిగే మ్యాచ్లో చోటు దక్కడం ఖాయమని తెలుస్తోంది. అయితే రోహిత్ శర్మ వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైరికల్గా స్పందిస్తున్నారు. చివరి మ్యాచ్లో రోహిత్ తన స్థానాన్ని అర్జున్ టెండూల్కర్ కోసం త్యాగం చేస్తాడని, తిలక్ వర్మ సారథిగా జట్టును నడిపిస్తాడని వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.