|
గ్రేడ్ల వారిగా..
భారత సెంట్రల్ కాంట్రాక్టులు ప్రకారం ఏ+ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి రూ.7 కోట్లు, ఏ గ్రేడ్ ప్లేయర్స్కు రూ. 5 కోట్లు, బీ గ్రేడ్ ఆటగాళ్లకు రూ.3 కోట్లు, సీ గ్రేడ్ ప్లేయర్లకు కోటీ రూపాయాల వార్షిక వేతనం అందుతుంది. ఇక మ్యాచ్ ఫీజులు టెస్ట్లకు రూ.15 లక్షలు, వన్డేలకు 6 లక్షలు, టీ20లకు రూ.3లక్షలు ఇస్తున్నారు. ఆటగాళ్లు సెంచరీ చేసినా లేదా 5 వికెట్లు తీసినా మరో రూ.5 లక్షలు బోనస్గా అందజేస్తున్నారు. డబుల్ సెంచరీ చేస్తే రూ.7లక్షలు ఇస్తున్నారు.
|
ఫార్మాట్ల వారిగా..
ఇంగ్లండ్ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు గమనిస్తే..మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లకు రూ. 9.8 కోట్లు, కేవలం టెస్ట్లు మాత్రమే ఆడే వారికి రూ.6.7 కోట్లు, లిమిటెడ్ ఫార్మాట్ ప్లేయర్లకు రూ.3.1 కోట్లను వార్షిక వేతనంగా అందజేస్తున్నారు. మ్యాచ్ ఫీజులు.. టెస్ట్లకు రూ.18.5 లక్షలు, వన్డేలు 10 లక్షలు, టీ20లకు రూ.5.1 లక్షలు ఇస్తున్నారు. మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్కు కెప్టెన్కు 25 శాతం బోనస్గా సాలరీ అందుతుంది.
తేడా ఎంతంటే..?
ఇరు జట్ల ఆటగాళ్ల జీతాలు పరిశీలిస్తే.. భారత క్రికెటర్ల కంటే ఇంగ్లండ్ ప్లేయర్లు సుమారు రూ.2.8 కోట్లు అదనంగా జీతం అందుకుంటున్నారు. మ్యాచ్ ఫీజుల్లో కూడా భారీ తేడానే ఉంది. టెస్ట్లకు రూ.3.5 లక్షలు, వన్డేలకు రూ.4 లక్షలు, టీ20లకు రూ.2.1 లక్షల వ్యత్యాసం ఉంది. అయితే బోనస్ విషయంలో మాత్రం టీమిండియా ఆటగాళ్లదే పై చేయి. ఇంగ్లండ్ కేవలం తమ కెప్టెన్కు మాత్రం బోనస్ అందజేస్తుండగా.. భారత్ వ్యక్తిగత ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇస్తుంది. ఈ వ్యత్యాసంతోనే ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జోరూట్ అందరి సారథుల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నాడు.