బంతిని భిన్నంగా చూసేందుకు
"బంతిని భిన్నంగా చూసేందుకు భారత్-బంగ్లా మ్యాచ్ అంపైర్లు స్పెషల్ లెన్సెస్ ధరిస్తారో లేదో నాకు తెలియదు. అది వారికి సంబంధించిన విషయం. కానీ, వారు నెట్ ప్రాక్టీస్ సెషన్లకు హాజరయ్యే అవకాశం ఉంది. దీనివల్ల సరైన సమయంలో సరైన అంశాలే చూడగల ఆత్మవిశ్వాసం వస్తుంది. సంధ్యవెలుగులో బంతిని గుర్తించడం బ్యాట్స్మెన్కు సవాల్. అంపైర్లకూ ఇదే ఓ ఛాలెంజ్ కానుంది" అని సైమన్ టౌఫెల్ అన్నాడు.
‘ఫైండింగ్ ద గ్యాప్’ పుస్తక ప్రమోషన్లో
తన ఆటో బయోగ్రఫీ ‘ఫైండింగ్ ద గ్యాప్' పుస్తక ప్రమోషన్లో భాగంగా సైమన్ టౌఫెల్ ప్రస్తుతం భారత్లోనే ఉన్నారు. నవంబర్ 22 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ప్రతిష్టాత్మక డే/నైట్ టెస్టుకు సైమన్ టౌఫెల్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. పింక్ బాల్తో ఎలాంటి అనుభవం లేని బంగ్లా క్రికెటర్లు ఈ టెస్టులో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.
పింక్ బాల్తో ఆడిందో లేదో
"దేశవాళీ పోటీల్లో బంగ్లాదేశ్ పింక్ బాల్తో ఆడిందో లేదో తెలియదు. రెండు జట్ల మధ్య వారు (బంగ్లాదేశ్) ఆడేందుకు అతిపెద్ద సవాల్ను కలిగి ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వారికి అలవాటు లేని కొత్త రంగు బంతితో ఆడుతున్నారు. మంచు కురిస్తే ఫీల్డింగ్ కష్టమవుతుంది. బంతి రంగు, ప్రవర్తనను గమనించాల్సి ఉంటుంది" అని సైమన్ టౌఫెల్ అన్నాడు.
సచిన్ సరసన చేరేనా? అడిలైడ్ టెస్టులో నసీమ్ షా, అందరి చూపు అతడివైపే!
ఏ దశలో కొత్త బంతిని ఇవ్వాలో
"ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఏ దశలో కొత్త బంతిని ఇవ్వాలో అంపైర్లు పరిగణనలోకి తీసుకోవాలి. 50 ఓవర్ల వరకు తెలుపు బంతిని రక్షించడమే మాకు కష్టమవుతుంది. ఇప్పుడు పింక్ బాల్ని 80 ఓవర్ల వరకు కొనసాగించాలని అంటున్నారు. టీమిండియా సీమర్ల బౌలింగ్ను బ్యాట్స్మెన్ మరింత శ్రద్ధతో గమనించాలి" అని టౌఫెల్ అన్నాడు.
భారత సీమర్లను అర్థం చేసుకోవడంపై
"నేను బ్యాట్స్మన్గా ఉంటే, భారత సీమర్లను అర్థం చేసుకోవడంపై నేను ఎక్కువ దృష్టి పెడతాను. స్పిన్నర్లను అగౌరవ పరచొద్దు. అశ్విన్, జడేజా, కుల్దీప్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు కోహ్లీసేనలో ఉన్నారు. టెస్టు క్రికెట్ను బ్రతికించుకోడానికి డే/నైట్ టెస్టులు మాత్రమే పరిష్కారం కాదు. మరెన్నో సంస్కరణలు అవసరం" అని టాఫెల్ తెలిపాడు.