
ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్(50 బంతుల్లో 57, 4 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో ఈ సిరిస్లో మొత్తం 217 పరుగులు చేసిన వార్నర్ను మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా వరించింది. తొలి టీ20లో వార్నర్ సెంచరీతో చేలరేగిన సంగతి తెలిసిందే.
ఇక, బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టీ20లో సైతం హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (57) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాట్స్మెన్ తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు.
ఫించ్ ఔటైన కొద్దిసేపటికే స్టీవ్ స్మిత్ (13), బెన్ మెక్డోర్మెట్ (5) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. దీంతో 14 పరుగుల వ్యవధిలోనే ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. చివర్లో ఆష్టన్ టర్నర్(22 నాటౌట్) చెలరేగడంతో ఆస్ట్రేలియా అలవోక విజయాన్ని నమోదు చేసింది.