19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..
సురేశ్ రైనా సునామీ ఇన్నింగ్స్తో 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒక బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. బ్యాటింగ్లోనే కాకుండా.. బౌలింగ్లోనూ రైనా సత్తాచాటాడు.టైటాన్ జెడ్ఎక్స్ ఛేదనలో ఆరంభం నుంచే సురేశ్ రైనా దూకుడుగా ఆడేశాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన సురేశ్ రైనా.. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడేశాడు.
బౌలింగ్లోనూ..
దాంతో ఓవర్కు కనీసం 10 పరుగుల చొప్పున రాబడుతూ వచ్చిన రైనా.. ఒంటిచేత్తో టీమ్కు విజయాన్ని అందించాడు. అంతకముందు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన రైనా.. 27 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా పడగొట్టాడు. రైనా ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియోను సురేశ్ రైనా ఫ్యాన్స్ క్లబ్ షేర్ చేయగా.. వైరల్ అయింది. ఐపీఎల్ 2020 సీజన్కు వ్యక్తిగత కారణాలతో సురేశ్ రైనా దూరమైన విషయం తెలిసిందే. ఓవైపు కరోనా, మరోవైపు కుటుంబ సభ్యుల దారుణ హత్యతో టోర్నీ ముందే తప్పుకున్నాడు.
|
సీఎస్కే తరఫునే..
రైనా గైర్హాజరీలో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమైంది. టోర్నీ చరిత్రలోనే తొలి ప్లే ఆఫ్ చేరకుండా నిష్క్రమించింది. ఐపీఎల్ 2021 సీజన్లో సురేశ్ రైనా సీఎస్కే తరఫునే బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ ఇటీవల రైనాను రిటైన్ చేసుకుంది. భారత్ వేదికగా ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్లు జరగనున్నాయి. గతేడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్కు సురేశ్ రైనా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ధోనీ ఆటకు అల్విదా ప్రకటించినా క్షణంలోనే అతని బాటలోనే తాను కూడా అని సురేశ్ రైనా తెలిపాడు.