ఆగస్టు-సెప్టెంబర్లో లీగ్?:
'ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాం. ఫ్రాంచైజీలతో మాట్లాడుతున్నాం. అందరి ఆరోగ్యమే ముఖ్యం. కరోనా పరిస్థితులపై అంచనా వేసి నిర్ణయం తీసుకుంటాం. ఆగస్టు-సెప్టెంబర్లో నిర్వహించాలని భావిస్తున్నాం. అయితే ఆ సమయంలో కొన్ని టోర్నీలు ఉన్నాయి' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ఆసియా కప్ అడ్డంకి:
సెప్టెంబర్లో భారత్ ఆసియా కప్ ఆడాల్సి ఉంది. మరోవైపు ఆగస్టు-సెప్టెంబర్లో స్వదేశంలో ఇంగ్లాండ్తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాలి. టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాలో మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఇదే సమయంలో ఇంగ్లాండ్ సొంతగడ్డపై పాకిస్థాన్, ఐర్లాండ్తో సిరీస్ ఆడనుంది. ఇక వెస్టిండీస్ పర్యటనకు దక్షిణాఫ్రికా వెళ్లాల్సి ఉంది. ఐపీఎల్కు ఇవన్ని అడ్డంకిగా మారకుండా ఆయా బోర్డులతో బీసీసీఐ సంప్రదింపులు చేయాలి. ఇక ఆసియా కప్ను కూడా తర్వాత నిర్వహించాలని కోరాలి.
బ్రాడ్కాస్టర్తోనూ చర్చించాలి:
బ్రాడ్కాస్టర్తోనూ బీసీసీఐ చర్చించాల్సి ఉంది. ఆసియాకప్, ఐపీఎల్కు స్టార్ స్పోర్ట్సే బ్రాడ్కాస్టర్ కాబట్టి దీనిపై పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఐపీఎల్ను కాదని ఆసియా కప్కు మొగ్గుచూపితే.. స్టార్ స్పోర్ట్స్ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. వీటన్నింటి కంటే ఐపీఎల్ షెడ్యూల్లో మ్యాచ్ వేదికలను నిర్వహకులు జాగ్రత్తగా నిర్వహించాలి. ఆగస్టు-సెప్టెంబర్లో వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి సరైన మ్యాచ్ వేదికలను ఖరారు చేయాల్సిన అవసరం ఉంది.