న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శుభవార్త: ఆల్ ఇండియా రేడియాలో కోహ్లీసేన మ్యాచ్‌ల కామెంటేటరీ

BCCI partners with All India Radio for commentary in international and domestic games

హైదరాబాద్: క్రికెట్ ప్రియులకు నిజంగా ఇది శుభవార్త. టీవీల ముందు కూర్చుని మ్యాచ్‌ని వీక్షించలేనటువంటి క్రికెట్ అభిమానుల కోసం బీసీసీఐ ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. లైవ్ కామెంటేటరీ కోసం అల్ ఇండియా రేడియోతో బీసీసీఐ రెండేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది.

పాక్ టూర్‌ను లంక ఆటగాళ్లు బహిష్కరించడానికి కారణం భారతే!!పాక్ టూర్‌ను లంక ఆటగాళ్లు బహిష్కరించడానికి కారణం భారతే!!

ఆల్ ఇండియా రేడియోలో లైవ్ కామెంటేటరీ

ఆల్ ఇండియా రేడియోలో లైవ్ కామెంటేటరీ

ఈ ఒప్పందంలో భాగంగా ఇకపై కోహ్లీసేన ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు స్వదేశంలో జరిగే దేశవాళీ టోర్నీలకు సంబంధించి లైవ్ కామెంటేటరీని క్రికెట్ అభిమానులకు అందించనుంది. ఈ చొరవ భారతదేశం అంతటా ఉన్న మిలియన్ల మంది క్రికెట్ అభిమానులు లైవ్ రేడియో కామెంటేటరీని అనుసరించే అవకాశాన్ని కల్పిస్తుంది.

మూడో టెస్టులో హీరో... నాలుగో టెస్టుకు జీరో: లీచ్ ప్రదర్శనపై పీటర్సన్

సెప్టెంబర్ 15 నుంచి

సెప్టెంబర్ 15 నుంచి

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ అవకాశం అందుబాటులోకి రానుంది. త్వరలో సఫారీ జట్టు భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సఫారీ జట్టు 3 టీ20లు, 3 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

తొలుత మూడు టీ20ల సిరిస్

తొలుత మూడు టీ20ల సిరిస్

తొలుత మూడు టీ20ల సిరిస్ జరుగుతుండగా.. ఆ తర్వాత అక్టోబర్ 2 నుంచి మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది. టీ20 సిరిస్‌కు ధర్మశాల, మొహాలి(సెప్టెంబర్ 18), బెంగళూరు(సెప్టెంబర్ 22) వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి టెస్టుకు విశాఖపట్నం(అక్టోబర్ 2-6) ఆతిథ్యమిస్తోంది.

మరింత పదిలం: టెస్టు ర్యాంకుల్లో స్టీవ్ స్మిత్‌ను అందుకునే వాడే లేడా?

రెండేళ్ల ఒప్పందం

రెండేళ్ల ఒప్పందం

ఆ తర్వాత పుణె(అక్టోబర్ 10-14), రాంచీ(అక్టోబర్ 19-23) వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు పురుషుల, మహిళల దేశవాళీ మ్యాచ్‌లను కూడా ఆల్ ఇండియా రేడియో లైవ్ కామెంటెటరీ ఇవ్వనుంది. బీసీసీఐతో ఆల్ ఇండియా రెండేళ్ల ఒప్పందం సెప్టెంబర్ 10, 2019 నుంచి ఆగస్టు 31, 2021 వరకు ఉంటుంది.

Story first published: Tuesday, September 10, 2019, 19:01 [IST]
Other articles published on Sep 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X