బీసీసీఐ అధికారిక ప్రకటన
ఈ విషయమై బీసీసీఐ ఓ అధికారిక ప్రకటన కూడా చేసింది. 'రోహిత్ శర్మకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చినందున శర్మకు బ్యాకప్ ప్లేయర్గా ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ మయాంక్ అగర్వాల్ను రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్ట్ కోసం భారత టెస్ట్ జట్టులో చేర్చింది. మయాంక్ ఇప్పటికే యూకేకి బయలుదేరాడు. త్వరలోనే జట్టుతో పాటు కలుస్తాడు.' అని బీసీసీఐ తన అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఇకపోతే లీసెస్టర్షైర్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో రోహిత్ శర్మ మొదటి ఇన్నింగ్స్లో ఓపెనర్గా బరిలోకి దిగి 25పరుగులు చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్లో మాత్రం అతను బ్యాటింగ్ చేయలేదు. ఆదివారం అతనికి పాజిటివ్ వచ్చినట్లు బీసీసీఐ ధృవీకరించింది.
సవరించిన భారత టెస్ట్ జట్టు
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ షమీ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మయాంక్ అగర్వాల్
కెప్టెన్ ఎవరు..? వైస్ కెప్టెన్ ఎవరు?
ఇక ఇంగ్లాండ్తో జరిగిన ఈ టెస్టు సిరీస్లో భారత్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇంతకుముందు రోహిత్ కెప్టెన్సీలో ఈ ఏడాది శ్రీలంకపై స్వదేశంలో 2-0తో ఇండియా టెస్టు సిరీస్ను కైవసం చేసుకున్న తర్వాత ఇది రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా రెండో టెస్ట్ పర్యటన. ఎడ్జ్బాస్టన్లో జులై 1న జరిగే మ్యాచ్ వరకు అతను కోలుకుంటే తుది జట్టులో ఉంటాడు.
లేకపోతే భరత్ గానీ మయాంక్ అగర్వాల్ గానీ తుది జట్టులో ఆడతారు. రోహిత్ ఆడని పక్షంలో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు ఎవరు చేపడతారనే విషయంలో డైలామా కొనసాగుతుంది. పుజారా లేదా రిషబ్ పంత్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే అవకాశముండగా.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్థానంలో.. అశ్విన్ లేదా జస్ప్రీత్ బుమ్రా పగ్గాలు చేపట్టొచ్చు.