ఎన్వోసీ జారీ చేయని ఆసీస్..
అయితే పరిమిత ఓవర్ల సిరీస్లకు దూరంగా ఉన్న ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా ఎన్వోసీ ఇవ్వడం లేదు. దాంతో వారు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే చాన్సుంది. ఏప్రిల్ 6 వరకు వారిని ఐపీఎల్ ఆడినిచ్చేదిలేదని క్రికెట్ ఆస్ట్రేలియా మొండిపట్టుమీదున్నట్లు తెలుస్తోంది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా వైఖరిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బోర్డు పెద్దలు ఈ విషయమై ఆస్ట్రేలియా బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బీసీసీఐ మాటను కాదనే ధైర్యం క్రికెట్ ఆస్ట్రేలియాకు లేదు. ఇక్కడ తలొగ్గపోతే వేరే విషయాల్లో ఇబ్బందులకు గురిచేస్తుందని ఆ బోర్డుకు తెలుసు.
ఏప్రిల్ 6 వరకు..
జట్టులో లేని ఆటగాళ్లను అడ్డుకోవడం దారుణమని ఓ ఫ్రాంచైజీకి చెందిన అధికారి అన్నాడు. ఆ ఆటగాళ్లంతా ఏప్రిల్ల 6న అందుబాటులోకి వస్తే.. కోవిడ్ రూల్స్ ప్రకారం వారి సేవలను వాడుకోవడానికి మరో వారం రోజులు టైమ్ పడుతుందని అసహనం వ్యక్తం చేశాడు. ఏప్రిల్11, 12 వరకు వారు అందుబాటులోకి రారాని, అప్పటికే మూడు, నాలుగు మ్యాచ్లు అయిపోతాయన్నాడు. ఈ విషయంపై బీసీసీఐతో మాట్లాడుతామని సదరు అధికారి పేర్కొన్నాడు. పాకిస్థాన్ పర్యటనలోని జట్టులో ఉన్నా లేకున్నా ఏప్రిల్ 6 వరకు అనుమతించేదే లేదని.. ఐపీఎల్ కాంట్రాక్టులున్న ఆటగాళ్లందరికి క్రికెట్ఆస్ట్రేలియా సోమవారమే తెలియజేసింది.
ఐపీఎల్ ఆడనున్న ఆసీస్ ఆటగాళ్లు:
ప్యాట్ కమిన్స్(కేకేఆర్- రూ.7.25 కోట్లు), మిచెల్ మార్ష్( ఢిల్లీ క్యాపిటల్స్- రూ.6.50 కోట్లు), డేవిడ్ వార్నర్(ఢిల్లీ క్యాపిటల్స్- రూ.6.25 కోట్లు), డానియల్ సామ్స్(ముంబై ఇండియన్స్- రూ.2.6 కోట్లు), మాథ్యూవేడ్( గుజరాత్ లయన్స్- రూ.2.4 కోట్లు), నాథన్ కౌల్టర్ నైల్(రాజస్థాన్ రాయల్స్- రూ.2 కోట్లు), సీన్ అబాట్(సన్రైజర్స్ హైదరాబాద్- రూ.2.4 కోట్లు), రిలే మెరిడిత్(ముంబై ఇండియన్స్- రూ.1కోటీ), నాథన్ ఎల్లిస్(పంజాబ్ కింగ్స్- రూ.75లక్షలు), జాసన్ బెహ్రెండ్రాఫ(ఆర్సీబీ- రూ.75 లక్షలు), గ్లేన్ మ్యాక్స్వెల్(రూ.11 కోట్లు), మార్కస్ స్టోయినిస్(లక్నో-రూ.9.20 కోట్లు).