అత్యుత్తమ కెప్టెన్లలో ధోని ఒకడు
భారత జట్టు అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న తొలి అంతర్జాతీయ టోర్నీలోనే భారత్కు టీ20 వరల్డ్ కప్ను అందించాడు. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే.
2011లో వన్డే వరల్డ్కప్ అందించిన ధోని
ఆ తర్వాత స్వదేశంలో భారత్కు వన్డే వరల్డ్ కప్ను అందించాడు. 2011లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ధోని నాయకత్వంలోని టీమిండియా ముంబైలో జరిగిన ఫైనల్లో శ్రీలంకపై విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచింది. నువాన్ కులశేఖర బౌలింగ్లో ధోని భారీ సిక్సు బాది భారత్కు విజయాన్ని కట్టబెట్టాడు.
2013లో ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన ధోని
2013లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ను ఛాంపియన్గా నిలిపాడు. ఇలా ఐసీసీ నిర్వహించే మూడు మేజర్ టోర్నీలను నెగ్గిన భారత కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ధోని నాయకత్వంలోని టీమిండియా టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకుని సైతం సొంతం చేసుకుంది.
2015లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని
టెస్టు క్రికెట్కు ఇప్పటికే వీడ్కోలు పలికిన ధోని, 2015లో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుని విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సరిగ్గా 696 రోజుల తర్వాత మరోసారి భారత జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించడం విశేషం.