లార్డ్స్ టెస్టులో సెంచరీ:
2014 లార్డ్స్ టెస్టులో భారత జట్టు సభ్యులు ఇబ్బందులు పడిన పిచ్పై అజింక్య రహానే తొలి ఇన్నింగ్స్లో అద్భుతంగా ఆడాడు. జేమ్స్ ఆండర్సన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ పేసర్లను సంమర్ధవంతగా ఎదుర్కొన్నాడు. ఓ దశలో పేసర్ భువనేశ్వర్ కుమార్తో కలిసి జింక్స్ 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తంగా 154 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. దీంతో 28 ఏళ్ల తర్వాత ప్రతిష్ఠాత్మక లార్డ్స్మైదానంలో భారత్ విజయం సాధించింది.
ప్రపంచకప్లో 79 పరుగులు:
2015లో ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో అజింక్య రహానే దూకుడుగా ఆడాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ సహా.. 60 బంతుల్లోనే జింక్స్ 79 పరుగులు చేయడంతో భారత్ 7 వికెట్లకు 307 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజం ప్రదర్శించడంతో దక్షిణాఫ్రికా 177 పరుగులకే ఆలౌటైంది.
దేశ ప్రజల్లో అవగాహన:
మహమ్మారి కరోనా వ్యాప్తి కారణంగా క్రికెట్ టోర్నీలు నిలిచిపోయాయి. అనుకోని విశ్రాంతి లభించడంతో.. ఆటగాళ్లు అందరూ సరదాగా కుటుంబంతో గడుపుతున్నారు. అదేసమయంలో అభిమానులతో సంభాషించడానికి ఆటగాళ్ళు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. గత నెల రోజులుగా భారత్ను పట్టిపీడిస్తున్న మహమ్మారి కోవిడ్ -19పై రహానే ట్విట్టర్లో దేశ ప్రజల్లో అవగాహన పెంచుతున్నాడు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, నిత్యం చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించాడు.
కరోనా సాయం 10 లక్షలు:
దేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం అజింక్య రహానే ముందుకొచ్చిన విషయం తెలిసిందే. తన వంతు సాయంగా రూ. 10 లక్షల రూపాయాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించాడు. ఈ విషయాన్ని రహానే సన్నిహితుడొకరు పీటీఐ వార్త సంస్థకు తెలియజేశారు. అయితే రహానే మాత్రం ఇప్పటి వరకు తాను చేసిన సాయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.