హైదరాబాద్: క్రికెట్లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే బ్యాట్స్మెన్లకు అతడొక సింహస్వప్నం. టీ20 క్రికెట్లో అత్యద్భుత స్థాయిలో రెండు సార్లు వికెట్లు తీసిన ఏకైక బౌలర్ అతడు. ఆ మిస్టరీ స్పిన్నర్ బౌలర్ మరెవరో కాదు లంక క్రికెటర్ అజంతా మెండిస్.
To celebrate the birthday of Ajantha Mendis, we take a look back at his sensational performance with the ball against Zimbabwe in the 2012 World T20!
— ICC (@ICC) March 11, 2018
His figures on that day of 6/8, are still the best ever for a bowler in T20Is!
Happy Birthday! 🎂 🎉 pic.twitter.com/KmDbnLIubq
ఈ లంక బౌలర్ పుట్టినరోజు సందర్భంగా ఐసీసీ అతనికి శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు, ఈ స్టార్ బౌలర్ అద్భుతమైన ప్రదర్శనను సైతం గుర్తి చేసుకుంది. 2012లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో భాగంగా శ్రీలంక ఫస్ట్ మ్యాచ్ జింబాబ్వేతో ఆడింది.
ఆ మ్యాచ్లో కేవలం 8 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి లంక విజయంలో కీలకపాత్ర పోషించాడు మెండిస్. ఆ మ్యాచ్ లో బ్యాట్స్మెన్లు పెవిలియన్కు చేరుకున్న పరంపరను ఐసీసీ వీడియో రూపంలో పోస్ట్ చేసింది.
ఆ మ్యాచ్లో మిస్టరీ బౌలర్ మెండిస్ ప్రత్యర్ధి ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఐసీసీ టీ20 క్రికెట్లో ఇప్పటికీ అత్యుత్తుమ ప్రదర్శనను తన పేరిట లిఖించుకున్న మెండిస్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు.