|
82 పరుగులు చేసిన డివిలియర్స్
ఈ మ్యాచ్లో ఏబీ డివిలియర్స్ 44 బంతుల్లో 3 ఫోర్లు,7 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఏబీ డివిలియర్స్ ఒంటి చేత్తో బాదిన సిక్స్ మ్యాచ్కే హైలెట్గా నిలిచింది. డివిలియర్స్ బాదిన సిక్స్ దెబ్బకు బంతి స్టేడియం పైకప్పు పైన పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
|
19వ ఓవర్లో
ఆర్సీబీ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. షమీ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఐదో బంతిని ఏబీ డివిలియర్స్ ఒంటి చేత్తో సిక్సర్గా మలిచాడు. అమాంతం గాల్లోకి లేచిన బంతి ఒక్కసారిగా స్టేడియం పైకప్పు పడింది. నడుముకు పైఎత్తులో వచ్చినా ఆ బంతిని అంపైర్ నోబాల్గా ప్రకటించకపోవడంతో కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
|
17 పరుగుల తేడాతో విజయం
కాగా, ఈ ఓవర్లో డివిలియర్స్ మొత్తం మూడు సిక్సర్లు బాదాడు. ఆఖరి రెండు ఓవర్లలో ఆర్సీబీ 48 పరుగులు రాబట్టడంతో బెంగళూరు 200కుపైగా పరుగులు దాటింది. అనంతరం ఆర్సీబీ నిర్దేశించిన 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 185 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆర్సీబీ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.