ఫైనల్లో నలుగురు:
పురుషుల విభాగంలో అమిత్ పంఘల్ (52 కేజీలు), కవిందర్ సింగ్ బిష్త్ (56 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), దీపక్ సింగ్ (49 కేజీలు) ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్లో అమిత్ 4-1తో జియాంగున్ హు (చైనా)పై.. కవిందర్ 4-1తో ఎంఖ్ అమర్ ఖర్ఖు (మంగోలియా)పై.. ఆశిష్ కుమార్ 3-2తో మౌసవీ సెయెద్షాహిన్ (ఇరాన్)పై విజయం సాధించారు. ఇక దీపక్కు తెమిర్తాస్ జుసుపోవ్ (కజకిస్తాన్) నుంచి వాకోవర్ లభించింది.
ఫైనల్లో పూజా రాణి, సిమ్రన్జిత్:
మహిళల విభాగంలో పూజా రాణి (81 కేజీలు), సిమ్రన్జిత్ కౌర్ (64 కేజీలు) ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్లో పూజా రాణి 5-0తో ఫరీజా షోల్టే (కజకిస్తాన్)పై.. సిమ్రన్జిత్ కౌర్ 5-0తో మలియెవా మఫ్తునాఖోన్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందారు.
7 కాంస్య పతకాలు:
తెలుగమ్మాయి నిఖత్ జరీన్ (51 కేజీలు) కాంస్యం సాధించింది. గురువారం జరిగిన సెమీఫైనల్స్లో 0-5 తేడాతో గుయెన్తి (వియత్నాం) చేతిలో పరాజయం చెందింది. ఇతర సెమీఫైనల్స్లో సరితా దేవి 0-5తో వెన్లు యాంగ్ (చైనా) చేతిలో.. మనీషా 2-3తో హువాంగ్ సియావో వెన్ (చైనీస్ తైపీ) చేతిలో.. సోనియా చహల్ 2-3తో నిలావన్ టెక్సుయెప్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయారు. పురుషుల విభాగంలో శివ థాపా 1-4తో జకీర్ సఫిలిన్ (కజకిస్తాన్) చేతిలో.. ఆశిష్ 0-5తో బోబో ఉస్మాన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓటమిని ఎదుర్కొన్నారు. గాయం కారణంగా సతీశ్ కుమార్ బరిలోకి దిగలేదు.