గోపీచంద్ అకాడమీలో
అనంతరం గోపీచంద్ అకాడమీలో పీవీ సింధు మాట్లాడుతూ "ఈసారి నిజంగానే ఫోకస్ పెట్టా... ఎందుకంటే ఇప్పుడు నేను కొత్త కోచ్ మిస్ కిమ్ను కలిగి ఉన్నా. గత కొన్ని నెలలుగా ఆమె పర్యవేక్షణలో కఠినమైన శిక్షణ తీసుకున్నా. ఎంతో మెరగయ్యా. ఆమెకు నిజంగా చాలా కృతజ్ఞతలు" అని అన్నారు.
ఐఎస్ఎల్లో హైదరాబాద్: మొన్న ఐపీఎల్... నిన్న ప్రో కబడ్డీ... నేడు పుట్బాల్
కిమ్ జి హ్యూన్ మాట్లాడుతూ
కాగా, స్పోర్ట్స్ స్టార్కు ఇచ్చిన ఇంటర్యూలో కిమ్ జి హ్యూన్ మాట్లాడుతూ "నేను ఇక్కడికి డబ్బు సంపాదించడానికి రాలేదు, ఛాంపియన్లను తయారు చేస్తా. నేను ఇక్కడ నా జాబ్ను ఎంజాయ్ చేయలేకపోతే(స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా-గోపీ చంద్ బ్యాడ్మింటన్ అకాడమీ) రాజీనామా చేయడానికి కూడా వెనుకాడను" అని అన్నారు.
ఆకాశంలో విహరిస్తున్నా
"నాతో పాటు నా ట్రైనీలలో ప్రతి ఒక్కరూ వారి పాత్రను ఆనందిస్తారని నేను భావిస్తున్నాను. నా పర్యవేక్షణలో సింధు వరల్డ్ ఛాంపియన్షిఫ్లో స్వర్ణం నెగ్గడంతో ఆకాశంలో విహరిస్తున్నా. శారీరక, మానసిక, నైపుణ్యాలను ఎప్పటిలాగే మెరుగుపరచడానికి సింధు పట్ల నా ప్రాధాన్యత కొనసాగుతూనే ఉంటుంది. ఒలింపిక్స్ నేపథ్యంలో రిలాక్స్ అవడం కుదరదు" అని ఆమె తెలిపారు.
1994 హిరోషియా ఆసియా గేమ్స్లో స్వర్ణం
కిమ్ జి హ్యూన్ విషయానికి వస్తే ఆమె మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్. 1994 హిరోషియా ఆసియా గేమ్స్లో స్వర్ణ పతకం సాధించారు. మాజీ వరల్డ్ నంబర్ 2 సుంగ్ జీ-హ్యూన్కు కూడా కోచింగ్ ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆమె పీవీ సింధుకు కోచ్గా నియమింపబడ్డారు.