హైదరాబాద్: ఉబెర్ కప్ నుంచి భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు నిష్క్రమించింది. మంగళవారం థామస్ కప్ నుంచి పురుషుల జట్టు నిష్క్రమిస్తే.. బుధవారం సైనా నెహ్వాల్ సారథ్యంలోని భారత బ్యాడ్మింటన్ జట్టు ఉబెర్ కప్ ఫైనల్ నుంచి నిష్క్రమించింది.
తప్పక నెగ్గాల్సిన గ్రూప్-ఎ చివరి మ్యాచ్లో 0-5 తేడాతో జపాన్ చేతిలో చిత్తుగా ఓడింది. గత ఏడాది ఇదే టోర్నీలో కాంస్యం సాధించిన భారత్.. ఈ ఏడాది మాత్రం ఏస్ షట్లర్లు పీవీ సింధు, అశ్విని పొన్నప్ప లేకుండా బరిలోకి దిగింది. బుధవారం జరిగిన తొలి సింగిల్స్లో సైనా శుభారంభాన్ని ఇస్తుందని ఆశించారు.
అందుకు తగ్గట్టే ఆరంభంలో అద్భుత ప్రదర్శన చేసిన సైనా నెహ్వాల్.. ఆ తర్వాత అనవసర తప్పిదాలతో మ్యాచ్ను చేజార్చుకుంది. 19-21, 21-9, 20-22 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ యమగూచి చేతిలో సైనా నెహ్వాల్ పోరాడి ఓడింది. ఇక, డబుల్స్ తొలి మ్యాచ్లో సన్యోగిత-ప్రజక్త జోడీ 15-21, 6-21తో అయాక-మిసాకి జంట చేతిలో ఓడింది.
It was a tough Uber cup for me ... three good matches and a very close match against Akane yamaguchi of Japan ...had 4 match points but couldn’t convert but will work hard and try n do better in the upcoming tournaments...19-21 ,21-9,20-22 ...#UberCup2018 #bangkok pic.twitter.com/46giLg4qvE
— Saina Nehwal (@NSaina) May 23, 2018
మరో సింగిల్స్లో మ్యాచ్లో వైష్ణవి రెడ్డి 10-21, 13-21 తేడాతో ఒకుహర చేతిలో ఓటమి పాలైంది. నాలుగో మ్యాచ్లో వైష్ణవి భాలే- మేఘనా జక్కంపూడి జోడీ 8-21, 17-21తో.. చివరి మ్యాచ్లో అరుణ 12-21, 7-21తో ప్రత్యర్థుల చేతుల్లో ఓడాయి. దీంతో ఈ ఏడాది ఉబెర్ కప్ నుంచి భారత్ ఏ పతకం లేకుండా వెనుదిరిగింది.
Uber cup #impactarenabangkok 2018 ☺️☺️ pic.twitter.com/kUnTdJKU2a
— Saina Nehwal (@NSaina) May 21, 2018