జాగ్రత్తగా పరిశీలన చేసుకున్న తర్వాతనే పేస్తో జత కట్టకూడదని నిర్ణయం తీసుకున్నానని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. యవనోత్తేజంలో ఉన్నప్పుడే విభేదాలను పక్కన పెట్టి కలిసి ఆడి విజయం సాధించలేకపోయామని, ఇప్పుడు అది జరుగుతుందని అనుకోవడం లేదని ఆయన అన్నారు.
తాను ఒలింపిక్స్కు వెళ్తే భారత్కు పతకం సాధించే ఏకైక లక్ష్యంతో వెళ్తానని, పేస్తో తాను ఆ పని చేయలేనని, రోహన్తో అయితే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ప్లే ఆఫ్లో 2004 ఏథెన్స్లో పేస్తో కాంస్య పతకాన్ని కోల్పోయిన రోజు అత్యంత దుర్దినమని, ఆ నష్టం నుంచి కోలుకోవడానికి తనకు చాలా కాలం పట్టిందని, ఇప్పుడు అత్యంత దుర్దశగా భావిస్తున్నానని ఆయన అన్నారు.