|
తల కొట్టేసినట్టుగా అనిపిస్తుంది.
వారు మాస్క్లు ధరించడంతో పాటు, టీ షర్టులతో, స్కార్ఫ్లతో మొహాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలా ఇబ్బందులు పడుతోన్న క్రీడాకారుల ఫొటోలు కొన్ని భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ దృష్టికి వచ్చాయి. అందులో ఒక ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ..‘తల కొట్టేసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఎవరు లెక్క చేస్తారు' అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది మా శరీరానికి మంచిది కాదని
'ఢిల్లీలో నెలకొన్న పరిస్థితితో మా కుటుంబం ఆందోళన చెందుతోంది. ఇది మా శరీరానికి మంచిది కాదని తెలుసని' బల్గేరియన్ క్రీడాకారిణి ఒకరు వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో వాయు నాణ్యత సురక్షిత స్థాయి కంటే 80 రెట్లు క్షీణించిందని కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది.
స్వచ్ఛమైన గాలి ఉండే ఫిన్లాండ్ నుంచి
‘ఇక్కడి పరిస్థితిపై నా కుటుంబం తీవ్రమైన ఆందోళనలో ఉంది. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి ఉండే ఫిన్లాండ్ నుంచి వచ్చాను. కానీ ఇక్కడ శ్వాస తీసుకునేందుకే ఇబ్బందిగా ఉంది. అందుకే స్కార్ఫ్ ధరిస్తున్నాను' అని బాక్సర్ మోనా మెట్సియాన్ తెలిపింది.
కాలుష్యం కారణంగా కళ్లల్లో మంటగా
కాలుష్యం కారణంగా తమ కళ్లల్లో మంటగా ఉంటోందని ఇప్పటికే ఏడుగురు యూరోపియన్ బాక్సర్లు ఫిర్యాదు చేశారు. అయినా నిర్వాహకులు వారికి ఎలాంటి రక్షణ పరికరాలను ఇవ్వడం లేదు. మరోవైపు ఢిల్లీలో అత్యంత ఆధునిక సౌకర్యాలు ఉండడంతో వేదిక మార్పు అనేది అసంభవమని భారత బాక్సింగ్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి జే కోవ్లీ తెలిపారు.