
అతలాకుతలం చేసిన అత్యాచార ఆరోపణ:
భారత టీటీ రంగంలో మేటి ఆటగాడు దొరికాడనే ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. కానీ అంతలోనే అత్యాచార ఆరోపణ అతని జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. మానసికంగా దెబ్బతీసింది. ఇవన్నీ సమసిపోవాంటే ఆ ఆరోపణలు చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తలంచి నాలుగు నెలల తర్వాత ఆమెనే వివాహమాడాడు. చివరకు ఆ ఆరోపణలు చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు సౌమ్యజిత్.

కొన్ని రోజులు యూరోప్లోనే గడిపి
గత మార్చిలో ఓ 18ఏళ్ల అమ్మాయి తనను అత్యాచారం చేశాడంటూ సౌమ్యజిత్పై కేసు పెట్టింది. జర్మనీలోని ఓ క్లబ్కు ఆడుతున్న సమయంలో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. భారత్కు వస్తే అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో అతను కొన్ని రోజులు యూరోప్లోనే గడిపి మేలో స్వదేశానికి చేరాడు. తిరిగి టీటీలో సత్తాచాటాలనే పట్టుదలతో ఉన్నాడు.

డేటింగ్ మొదలెట్టినపుడు నా వయసు 22.
‘భారత్లోని ఓ ఆటగాడు విజయాలు సాధించాలంటే చాలా కష్టపడాలని చెబుతుంటారు. కానీ నా జీవితంలో నాలుగు నెలల క్రితం జరిగిన ఓ సంఘటన అంతకంటే కష్టాలను అనుభవించేలా చేసింది. పూర్తిగా నన్ను అతలాకుతలం చేసింది. ఆ సంఘటన పట్ల ఎలా వ్యవహరించాలో కూడా నాకు తెలియలేదు. తనది చిన్న వయసంటూ అందరూ అమ్మాయి వైపే మాట్లాడుతున్నారు. ఆమె మైనర్ కావొచ్చు, కానీ మేం డేటింగ్ మొదలెట్టినపుడు నా వయసు 22. నేను కూడా చిన్నవాణ్నే. అలా అనుకుంటూ గతంలోనే బతకడం నాకిష్టం లేదు. భవిష్యత్ ముఖ్యం. తొందర్లోనే కేసు ఓ కొలిక్కి వచ్చి తిరిగి సాధన చేస్తానని అనుకుంటున్నా' అని సౌమ్యజిత్ తెలిపాడు.

ఒలింపిక్స్ ఆడడమే నా లక్ష్యం.
‘ఆ సమయంలో నా నిజమైన శ్రేయోభిలాషులు ఎవరో నాకు తెలిసింది. నా కెరీర్ అత్యుత్తమ దశలో ఉండి జర్మనీలో ఓ మంచి క్లబ్ తరపున ఆడుతున్నపుడు ఇలా జరిగింది. ప్రస్తుతానికి మళ్లీ ఒలింపిక్స్ ఆడడమే నా లక్ష్యం. న్యాయపరమైన చిక్కులన్నింటినీ తొలగించుకోవాలి. బరువు కూడా పెరిగా. తిరిగి ఆడాలంటే చాలా కష్టపడాలని తెలుసు. తీవ్రంగా శ్రమిస్తా' అని అతను పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications
