25 అడుగుల భారీ కటౌట్:
హుస్సేన్ సాగర్లోని బుద్ధుని విగ్రహం వద్ద 25 అడుగుల భారీ కటౌట్తో జరిపిన వేడుకలు అభిమానులను ఆకట్టుకున్నాయి. డ్యాన్స్ ప్రొగ్రామ్తో పాటు బాణా సంచాతో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలు వెలుగులు విరజిమ్మాయి. ఈ సీజన్ తొలి అంచె పోటీలకు నగరంలోని గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది. దీంతో గచ్చిబౌలీలో మ్యాచ్లు చూసేందుకు అభిమానుల కోసం ప్రత్యేకంగా బస్సు ఏర్పాట్లు చేసినట్లు లీగ్ నిర్వాహకులు తెలిపారు.
యు ముంబాతో టైటాన్స్ ఢీ:
20వ తేదీ నుంచి జరిగే ఈ టోర్నీ తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ జట్టు యు ముంబాతో తలపడుతుంది. స్టార్రైడర్ సిద్దార్థ్ దేశాయ్ చేరికతో టైటాన్స్ జట్టు బలోపేతం అయింది. ఈ లీగ్ మ్యాచ్ల టికెట్లు https://www. eventsnow.com (ఈవెంట్స్ నౌ) వెబ్సైట్లో లభిస్తాయి. టికెట్ల ధరలను రూ. 500, రూ.800, రూ. 3000గా నిర్ణయించారు. టిక్కెట్లు కొనుక్కునేవారు ఈవెంట్స్ నౌ వెబ్సైట్ ఓపెన్ చేసి కావాలసిన మ్యాచ్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
డబుల్ రౌండ్ పద్ధతిలో:
పన్నెండు జట్ల మధ్య టోర్నీని ఈసారి డబుల్ రౌండ్ పద్ధతిలో నిర్వహించనున్నారు. అన్ని జట్లు మిగతా జట్లతో రెండేసి మ్యాచ్లు ఆడతాయి. లీగ్ దశ ముగిశాక తొలి ఆరు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ప్లేఆఫ్స్ నిర్వహిస్తారు. ఈ పోటీలు వివిధ నగరాల్లో సుమారు మూడు నెలల పాటు జరుగుతాయి. అక్టోబర్ 19న గ్రేటర్ నోయిడాలో జరిగే ఫైనల్తో ఏడో సీజన్ ముగుస్తుంది.