|
జైపూర్ జయభేరి
యుముంబా, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో జైపూర్ ఘనవిజయం సాధించింది. యుముంబాపై జైపూర్ 44-28 పాయింట్ల భారీ తేడాతో గెలిచింది. జైపూర్ జట్టులో అర్జున్ దేశ్వాల్ 17 రైడ్ పాయింట్లతో చెలరేగాడు. బ్రిజేంద్ర సింగ్ చౌదరీ 8 రైడ్ పాయింట్లతో సహకరించాడు. నితిన్ రావల్ 4, సందీప్ ధుల్, విశాల్ మూడేసి పాయింట్లు సాధించారు. ఒక యు ముంబా జట్టులో అజిత్ కుమార్ 11 రైడ్ పాయింట్లతో రాణించాడు. అభిషేక్ సింగ్ 5, శివమ్ 4 పాయింట్లు సాధించారు. రాహుల్ సీతాఫల్, రింకు, కల్మేష్ రెండేసి పాయింట్లు రాబట్టారు.
|
పాట్నా, బెంగళూరు హోరాహోరీ
పాట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ పోరులో చివరకు బెంగళూరుపై పాట్నా 36-34 తేడాతో విజయం సాధించింది. పాట్నా జట్టులో మోను గోయత్ 9, సునీల్ 6, సచిన్ 5, చంద్రశేఖర్ 3 పాయింట్లు సాధించారు. బెంగళూరు జట్టులో చంద్రన్ రంజిత్ 8, పవన్ కుమార్ 7, భరత్, నందల్ నాలుగేసి పాయింట్లు సాధించారు. ఈ మ్యాచ్ ద్వారా ఈ సీజన్లో 100 పాయింట్లు సాధించిన రైడర్గా బెంగళూరు బుల్స్ రైడర్ భరత్ నిలిచాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానాన్ని పాట్నా పైరేట్స్ మరింత పదిలం చేసుకుంది.
|
పుణే సూపర్ విక్టరీ
మరో మ్యాచ్లో తమిళ్ తలైవస్పై పుణేరి పల్టాన్ సూపర్ విక్టర్ కొట్టింది. తమిళ్ తలైవస్ను పుణే 43-31 పాయింట్ల తేడాతో ఓడించింది. పుణే జట్టులో మోహిత్ గోయత్ సూపర్ 10 సాధించాడు. అస్లాం 9, అభినేష్ 5, నితిన్ తోమర్, విశాల్ భరద్వాజ్ నాలుగేసి, సొంబిర్ 3 పాయింట్లు సాధించారు. ఇక తమిళ్ తలైవస్ జట్టులో హిమాన్ష్ 8, భవానీ రాజ్పుత్ 7, సుర్జీత, అంజిక్యా పవార్ మూడేసి పాయింట్లు సాధించారు.