
హైదరాబాద్: సుల్తాన్ అజ్లాన్ షా కప్లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. అదే తీరు, అదే వైఫల్యం.. ఓటమి నుంచి పాఠాలు నేర్వని భారత హాకీ జట్టు 2-4తో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంచుకుందామనుకున్న సర్దార్ సింగ్ సేనకు భంగపాటు తప్పలేదు.
నాలుగో రౌండ్లో రమణ్దీప్ సింగ్ భారత్కు రెండు గోల్స్ అందించి వైట్వాష్ను తప్పించాడు. మ్యాచ్లో నమోదైన రెండు గోల్స్ను రమణ్దీప్ సింగ్ (52, 53 నిమిషాల్లో) సాధించాడు. ఆసీస్కు వరుసగా ఇది మూడో విజయం. తొలి మ్యాచ్లో అర్జెంటీనా చేతిలో ఓటమి.. ఇంగ్లండ్పై డ్రా, ఇప్పుడు ఓటమితో భారత్ కేవలం ఒక్క పాయింట్తో ఐదో స్థానంలో ఉంది.
మరో రెండు మ్యాచ్లే మిగిలిఉన్న దశలో భారత్ ఫైనల్కు చేరడం దాదాపు అసాధ్యమే.. భారత్ బుధవారం మలేసియాతో తలపడుతుండగా, శుక్రవారం ఐర్లాండ్తో చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది.