న్యూజిలాండ్పై వన్డే సిరీస్ విజయాన్ని
ఇందులో భాగంగా తొలుత న్యూజిలాండ్పై వన్డే సిరీస్ విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటూ రోహిత్ను ముందుగా చాహల్ అడిగాడు. అదే సమయంలో తన బ్యాటింగ్ ఆర్డర్ను మార్చమంటూ రోహిత్ శర్మకు విజ్ఞప్తి చేశాడు. టీ20 సిరిస్కు సెలక్టర్లు కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో అతని స్థానంలో బ్యాటింగ్కు పంపాలంటూ కోరాడు.
|
మూడో స్థానంలో బ్యాటింగ్కు దింపుతావా
"కివీస్తో మూడు టీ20ల సిరీస్లో నన్ను మూడో స్థానంలో బ్యాటింగ్కు దింపుతావా రోహిత్ భయ్యా. కోహ్లి గైర్హాజరీ కారణంగా ఆ స్థానాన్ని నాకు కేటాయించు" అని చాహల్ జోక్ చేశాడు. దీనికి రోహిత్ శర్మ కూడా తనదైన శైలిలో బదులిచ్చాడు. "నాల్గో వన్డేలో నువ్వు టాప్ స్కోరర్గా నిలిచావ్. అంతవరకూ ఓకే కానీ ఆ మ్యాచ్ ఓడిపోయింది కదా. అయినా నీ విజ్ఞప్తిని పరీశిలిస్తాం. నిన్ను మూడో స్థానంలో పంపడానికి కోచ్ రవిశాస్త్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా" అని సరదాగా బదులిచ్చాడు.
నాలుగో వన్డేలో భారత్ ఓటమి
ఐదు వన్డేల సిరిస్లో హామిల్టన్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో మాత్రమే భారత్ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్లో భారత్ 92 పరుగులకు ఆలౌట్ కాగా, అందులో యజువేంద్ర చాహల్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. అదే సమయంలో కుల్దీప్ యాదవ్తో కలిసి 25 పరుగుల భాగస్వామ్యాన్ని చాహల్ నమోదు చేశాడు.