
393 పరుగులతో పాటు 14 వికెట్లు తీసిన పాండ్యా
ఈ సీజన్లో మొత్తం 15 మ్యాచ్లాడిన పాండ్యా 200కుపైగా స్ట్రయిక్ రేట్తో 393 పరుగులు చేయడంతో పాటు 14 వికెట్లు తీశాడు. ఐపీఎల్ చేసిన ప్రదర్శననే పాండ్యా వరల్డ్కప్లో కూడా కొనసాగిస్తాడని యువరాజ్ సింగ్ అన్నాడు. 2011 వరల్డ్ కప్లో యువీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుకి ఎంపికైన సంగతి తెలిసిందే.

యువీ మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో యువీ మాట్లాడుతూ "ఐదుగురు ఫీల్డర్ల రూల్ ప్రకారం పార్ట్ టైమర్లు రాణించలేరు. అదే ఐదుగురు(ఫ్రంట్ లైన్) బౌలర్లతో బరిలోకి దిగితే, ఎవరో ఒకరు నాలుగు లేదా ఐదు ఓవర్లు వేయగలరు. ఇందులో కొందరు రాణించలేకపోతే మరొకరు ఆ బాధ్యతను తీసుకోవచ్చు" అని యువరాజ్ సింగ్ తెలిపాడు.

పాండ్యాను కలిసినప్పుడు అదే చెప్పా
"ఇదే విషయాన్ని పాండ్యాను కలిసినప్పుడు చెప్పాను. ఇంగ్లాండ్ వరల్డ్కప్లో అటు బంతితోనూ, ఇటు బ్యాట్తోనూ రాణించే అవకాశం అతడికి ఉంది చెప్పాను. ప్రస్తుతం అతడు అలాంటి ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్లో ఉన్న ఫామ్నే వరల్డ్ కప్లో కూడా తప్పకుండా కొనసాగిస్తాడు" అని యువరాజ్ అన్నాడు. వరల్డ్ కప్ కోసం మే22న కోహ్లీసేన ఇంగ్లాండ్కు పయనం కానుంది.


Click it and Unblock the Notifications
