న్యూజిల్యాండ్తో టీ20 సిరీస్లో అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ యాదవ్కు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కింది. ఇది టీ20ల్లో అతనికి మూడో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కావడం గమనార్హం. ఈ అవార్డుతో భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి దూసుకొచ్చాడు సూర్యకుమార్. అతనితోపాటు వెటరన్ పేసర్ భువనేశ్వర్ కూడా మూడు టీ20 సిరీసుల్లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు.
ఈ జాబితాలో టాప్ ప్లేస్లో కింగ్ కోహ్లీ ఉన్నాడు. ఈ సూపర్ స్టార్ బ్యాటర్ ఇప్పటి వరకు తన కెరీర్లో ఏడు సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు అందుకున్నాడు. భారత్ తరఫున ఇన్ని సార్లు ఈ అవార్డును ఎవరూ అందుకోలేదు. తన మూడో అవార్డు అందుకున్న సూర్యకుమార్.. రెండో స్థానానికి వచ్చాడు. అంటే కోహ్లీ ఈ ఫార్మాట్లో ఎంతగా రాణించాడో అర్థం చేసుకోవచ్చు. ఇది చూసిన అభిమానులు కింగ్ కోహ్లీకి ఎందులోనూ పోటీ లేదంటూ కామెంట్లు చేస్తున్నాు.
వీళ్లిద్దరి తర్వాత బంతితో మాయ చేసే భువనేశ్వర్ కుమార్ కూడా మూడు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులతో ఉన్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్లో జరిగిన మూడు టీ20ల సిరీస్లో కూడా ఈ అవార్డు భువీకే దక్కిన సంగతి తెలిసిందే. భువీ తర్వాతి స్థానంలో టీమిండియా నయా సారధి రోహిత్ శర్మ ఉన్నాడు. అతను తన సుదీర్ఘ కెరీర్లో రెండు టీ20 సిరీసుల్లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. ఇక చివరి స్థానంలో ఈ ఫార్మాట్లో టీమిండియా టాప్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. అతను కూడా రోహిత్లాగే రెండు సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు.