|
బంతి ఆకారం మారిందని సందేహించిన ఫీల్డ్ అంపైర్లు:
రెండో రోజు ఆట ముగిసే దశలో బంతి ఆకారం మారిందని సందేహించిన ఫీల్డ్ అంపైర్లు అలీమ్ దార్, ఇయాన్ గౌల్డ్ మూడో రోజు బంతిని మార్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆటకు ముందే లంక కెప్టెన్ చండిమాల్కు చెప్పారు. దీంతో లంక జట్టు మైదానంలోకి దిగేందుకు ససేమిరా అనడంతో వివాదమైంది. దీంతో లంక ఆటగాళ్లు మైదానంలోకి రావడానికి నిరాకరించారు.
మ్యాచ్ రిఫరీ శ్రీనాథ్ రంగంలోకి దిగి:
దీంతో మ్యాచ్ రిఫరీ శ్రీనాథ్ రంగంలోకి దిగి లంకేయులతో చర్చలు జరిపాడు. కాసేపటికి ఆ జట్టు దిగి వచ్చింది. ఐతే లంక బౌలింగ్ సందర్భంగా బంతి ఆకారం దెబ్బ తిన్నందుకు అంపైర్లు విండీస్కు ఐదు పెనాల్టీ పరుగులిచ్చారు.
మ్యాచ్ ఆడేందుకు మరోసారి నిరాకరించి:
దీంతో లంకేయులు మరోసారి మ్యాచ్ ఆడేందుకు నిరాకరించారు. మళ్లీ శ్రీనాథ్ జోక్యం చేసుకొని మ్యాచ్ జరిగేలా చూశారు. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 253 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 300 పరుగులు సాధించింది. మూడో రోజు ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక 34/1తో ఉంది.
ఎలాంటి తప్పు చేయలేదని:
తమ ఆటగాళ్లు ఎలాంటి తప్పు చేయలేదని టీమ్ మేనేజ్మెంట్ తమకు వివరించిందని శ్రీలంక బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. వీడియో ఫుటేజిని పరిశీలించిన తరువాత ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరిగిందా లేదా అనేది తేల్చాల్సి ఉంది.