మంచి పునాది వేశారు:
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మరో మంచి గేమ్ ఆడాం. అందరూ సమిష్టిగా రాణించారు. ఉదయం పిచ్ను చూస్తే ముందుగా బ్యాటింగ్ చేయడమే మంచిదని అనుకున్నాం. మా బ్యాట్స్మెన్ మంచి పునాది వేశారు. వారి ఆటను చూస్తే 180 పరుగులు సాధిస్తాం అనిపించింది. అయితే పిచ్ స్లోగా ఉండడంతో తక్కువ స్కోర్ చేసాం. కృనాల్, జడేజా చివరలో విలువైన పరుగులు చేసారు' అని కోహ్లీ తెలిపాడు.
కొత్త బంతితో అద్భుతం చేశాడు:
'ఈ మ్యాచ్ గెలవడం ద్వారా సిరీస్ సొంతమైంది. తదుపరి మ్యాచ్లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించే వీలు పెరిగింది. అయితే మా అంతిమ లక్ష్యం మాత్రం విజయం సాధించడమే. యువ బౌలర్ వాషింగ్టన్ సుందర్ కొత్త బంతితో అద్భుతం చేశాడు. అతని ప్రదర్శన అద్భుతం. బ్యాట్తో కూడా మెరవగలడు. సుందర్ మాకు కీలకం కానున్నాడు. టీ20 మ్యాచ్కు ఎల్లప్పుడు ఆదరణ ఉంటుంది. గయనాలో ఇదివరకు ఆడలేదు. మరో మ్యాచ్ కోసం జట్టు సభ్యులంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
యాషెస్ తొలి టెస్టు: స్మిత్, వేడ్ సెంచరీలు.. ఇంగ్లండ్ లక్ష్యం 398
ప్రపంచ రికార్డు బద్దలు:
ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ (67; 51 బంతుల్లో 6×4, 3×6) అర్ధ సెంచరీ చేసాడు. మూడు సిక్సర్లు బాది టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాట్స్మన్గా రోహిత్ (107) రికార్డు సృష్టించాడు. విండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ (105) పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. ఈ సిరీస్కు ముందు రోహిత్ 102 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తొలి టీ20లో రెండు సిక్సర్లు బాదిన రోహిత్.. రెండో టీ20లో మూడు సిక్సర్లతో గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (103) మూడో స్థానంలో ఉన్నాడు. టాప్ ముగ్గురు కూడా ఓపెనర్లే కావడం విశేషం.