|
అధిక స్థాయిలో కాలుష్యం ఉన్నప్పటికీ
రాజధానిలో అధిక స్థాయిలో కాలుష్యం ఉన్నప్పటికీ, రెండు క్రికెట్ జట్లు మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ తన ట్విట్టర్లో "కఠిన పరిస్థితులలో మ్యాచ్ ఆడిన ఇరు జట్లకు ధన్యవాదాలు .. బంగ్లాదేశ్ అద్బుత ప్రదర్శన చేసింది" అంటూ ట్వీట్ చేశాడు.
7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం
తీవ్ర వాయు కాలుష్యం నడుమ మందకొడి పిచ్పై ఆదివారం జరిగిన తొలి టి20 మ్యాచ్లో బంగ్లా 7 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. 149 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా తొలి ఓవర్లోనే ఓపెనర్ లిటన్ దాస్ (7) వికెట్ కోల్పోయింది. కెరీర్లో తొలి మ్యాచ్ ఆడుతున్న నయీమ్ (28 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్), సౌమ్య సర్కార్ (35 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్సర్లు) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.
ముష్ఫికర్ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడే
పవర్ప్లే ముగిసేసరికి బంగ్లా 45 పరుగులు చేసింది. అయితే స్పిన్నర్ చహల్ తన తొలి ఓవర్లోనే నయీమ్ను అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్ రహీమ్ (43 బంతుల్లో 60 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి సర్కార్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ముష్ఫికర్ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు అవుటయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్నాడు.
కృనాల్ క్యాచ్ వదిలేయడంతో
ఇక దూకుడుగా ఆడుతున్న సర్కార్ను ఖలీల్ బౌల్డ్ చేయడంతో బంగ్లా మూడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో ముష్ఫికర్, మహ్ముదుల్లా (15 నాటౌట్) కలిసి జట్టును గెలుపు తీరాలకు చేరువ చేశారు. బంగ్లా విజయానికి 18 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో బౌండ్రీ వద్ద కృనాల్ క్యాచ్ వదిలేయడంతో ముష్ఫికర్ బతికిపోయాడు. ఆ ఓవర్లో బంగ్లా 13 పరుగులు పిండుకుంది.
148 పరుగులు చేసిన టీమిండియా
ఆ తర్వాత ఖలీల్ వేసిన ఓవర్లో ముష్ఫికర్ వరుసగా 4 ఫోర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. చివరి ఓవర్లో మహ్ముదుల్లా సిక్స్ కొట్టి బంగ్లాకు విజయాన్ని అందించాడు. బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.