ఢిల్లీ ఈజీగా గెలవాల్సిన మ్యాచ్..
'ఇది ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాల్సిన మ్యాచ్. గుజరాత్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని రిషభ్ పంత్ టీమ్ ఛేదించాలని అనుకున్నా. ఆ పిచ్పై ఇదేం పెద్ద లక్ష్యం కాదు. అలాగే పంత్, లలిత్ యాదవ్ ఉన్నంతవరకూ ఢిల్లీ జట్టు మంచి స్థితిలోనే కొనసాగింది. సడెన్గా లలిత్ రనౌటవ్వడంతో మ్యాచ్ గమనం మారిపోయింది. ఫెర్గూసన్ కూడా ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కీలక సమయంలో అతను.. పంత్, అక్షర్పటేల్ లాంటి కీలక వికెట్లు సాధించాడు. వాళ్లిద్దరూ గత మ్యాచ్లో ఢిల్లీని గెలిపించారు.
పాండ్యా కెప్టెన్సీ సూపర్..
దీన్నిబట్టి చూస్తే.. బలమైన బౌలింగ్ యూనిట్ కలిగి ఉండటం ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. రషీద్, షమీ, ఫెర్గూసన్ ముగ్గురూ గుజరాత్లో అత్యుత్తమ బౌలర్లు. ఢిల్లీ ఇన్నింగ్స్లో 15 ఓవర్లు పూర్తయ్యేసరికి పాండ్య వద్ద నలుగురు స్పెషలిస్టు బౌలర్లు మిగిలి ఉన్నారు. ఇక్కడ ఒక్క ఓవర్ సమన్వయం చేసుకోవాల్సి ఉన్నా పాండ్య తన బౌలర్లపై నమ్మకం ఉంచాడు. వాళ్లని రొటేట్ చేసిన విధానం గొప్పగా ఉంది. అతడి కెప్టెన్సీ ఆకట్టుకుంది' అని జాఫర్ మెచ్చుకున్నాడు.
పాండ్యా ఫిట్..
మరోవైపు పలువురు గుజరాత్ అభిమనులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వరుసగా రెండు విజయాలు సాధించడంతో పాండ్య కెప్టెన్సీని కొనియాడుతున్నారు. ఓ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం హార్దిక్ పాండ్యాకు ఇదే తొలిసారి. దేశవాళీ క్రికెట్లో కూడా అతను పెద్దగా కెప్టెన్సీ చేయలేదు. గత సీజన్ వరకు ముంబైకి ఆడిన అతను ఈ సీజన్ మెగా వేలం ముందు గుజరాత్ టైటాన్స్కు మారాడు. ఫిట్ నెస్ సమస్యలతో భారత జట్టుకు దూరమైన అతను ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్తో పాటు కెప్టెన్గా సత్తా చాటుతున్నాడు.