13 ఏళ్ల క్రితం టీమిండియాపై
13 ఏళ్ల క్రితం టీమిండియాపై వెస్టిండిస్ జట్టు వన్డే సిరిస్ను నెగ్గింది. 1979 తర్వాత నుంచి భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 131 వన్డే మ్యాచ్లు జరిగాయి. ఇందులో వెస్టిండిస్ 63 మ్యాచ్ల్లో విజయం సాధించగా... 20006 తర్వాత నుంచి ఇరు జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరిస్ల్లో టీమిండియాదే పైచేయి.
రెండో వన్డేకి ఆతిథ్యమిస్తోన్న విశాఖ
మూడు వన్డేల సిరిస్లో భాగంగా రెండో వన్డేకి ఆతిథ్యమిస్తోన్న విశాఖపట్నం స్టేడియంలో టీమిండియాకు మెరుగైన రికార్డు ఉంది. అంతేకాదు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వరుసగా రెండు వన్డే సిరీస్లు ఓడిపోయింది. 2002-2003లో వెస్టిండిస్తో జరిగిన 7 మ్యాచ్ల సిరిస్లో ఓడిపోగా... ఆ తర్వాత 2004-05లో పాకిస్థాన్తో వన్డే సిరిస్ను కోల్పోయింది.
మళ్లీ ఇన్నాళ్లకు
ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియా వరుసగా రెండు వన్డే సిరిస్ల్లో ఓడిపోయే అవకాశం వచ్చింది. విశాఖ వన్డేలో టీమిండియా ఓడితే వరుసగా సొంతగడ్డపై ఐదు వన్డేలు ఓడిన చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంటుంది. దీంతో పాటు సొంతగడ్డపై వరుసగా రెండు వన్డే సిరీస్లు ఓడిపోయిన జట్టుగా కూడా నిలుస్తుంది.
తొమ్మిది వన్డేల్లో ఆరింట విజయం
విశాఖపట్నంలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన తొమ్మిది వన్డేల్లో ఆరింట విజయం సాధించి ఒక దాంట్లో ఓడింది. ఆ ఓటమి కూడా వెస్టిండిస్ చేతిలోనే కావడం విశేషం. ఒక మ్యాచ్ టై కాగా మరొకటి వర్షం కారణంగా రద్దు అయింది.
ఇక్కడ చివరగా ఈ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్ టైగా ముగిసింది.
గత ఆరు వన్డేల్లో
ఈ స్టేడియంలో జరిగిన గత ఆరు వన్డేల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కేవలం ఒక్కసారే మాత్రమే విజయం సాధించింది. విశాఖ పిచ్పై స్పిన్నర్లు రాణించే అవకాశం ఉంది. చివరగా ఈ పిచ్పై జరిగిన వన్డేలో (భారత్, విండీస్ మధ్య) ఏకంగా 642 పరుగులు నమోదయ్యాయి. దీంతో టాస్ గెలిచిన జట్టు ఛేదనకు మొగ్గుచూపే అవకాశం ఉంది.