4000 పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీ
కోహ్లీకి కంటే ముందు ఈ రికార్డుని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలు అందుకున్నారు. సొంతగడ్డపై 4000 పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్కు 92 ఇన్నింగ్స్లు అవసరం కాగా, ధోనికి 100 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రికార్డుని సైతం కోహ్లీ(78 ఇన్నింగ్స్లు) బద్దలు కొట్టాడు.
ఏబీ రికార్డుని బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ
ఏబీ డివిలియర్స్ ఈ రికార్డుని 91 ఇన్నింగ్స్ల్లో అందుకోవడం విశేషం. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో మరో 31 పరుగులు చేస్తే కోహ్లీ 10 వేల పరుగుల క్లబ్లో చేరతాడు. కాగా, అంతకముందు కోహ్లీ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఓబెడ్ బౌలింగ్లో బంతిని మిడాఫ్ దిశగా హిట్ చేసేందుకు విరాట్ కోహ్లి (44) ప్రయత్నించాడు.
|
తడబడిన హోల్డర్... కోహ్లీకి లైఫ్
అయితే.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి గాల్లోకి లేవగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ క్యాచ్ని అందుకోలేకపోయాడు. బంతి గమనాన్ని అంచనా వేయడంలో తడబడిన హోల్డర్.. వెనక్కి వెళ్లి క్యాచ్ను పట్టే ప్రయత్నంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో కోహ్లీ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
|
హాఫ్ సెంచరీలతో చెలరేగిన కోహ్లీ, రాయుడు
అప్పటికి కోహ్లీ 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. ప్రస్తుతం భారత్ జట్టు 30 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(62) అంబటి రాయుడు (68) పరుగులతో ఉన్నారు.