గిల్క్రిస్ట్ మాట్లాడుతూ
దీనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ మాట్లాడుతూ "‘ఫీల్డ్ అంపైర్ అన్నీ వైపులా చూడాలంటే చాలా కష్టం. గతేడాది రీప్లే ఉండడంతో అది నోబాల్గా తేలింది. దాన్ని అలాగే అమలు చేయాలి. నాలుగో అంపైర్ అవసరం ఉన్నా లేకున్నా.. మూడో అంపైర్ రీప్లే చూసి వెంటనే నాటౌట్గా ఎందుకు నిర్ణయం తీసుకోవద్దు?" అని గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు.
అత్యుత్తమ విధానమని నేను భావిస్తున్నా
"ఇదే అత్యుత్తమ విధానమని నేను భావిస్తున్నా. ఒకవేళ నాలుగో అంపైర్ ఉండి సరైన నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆమోదిస్తాను. అయితే, ప్రత్యేక(నోబాల్స్) అంపైర్ వల్ల ఇలాంటి ఘటనలు తగ్గుతాయా అంటే తగ్గవు. ఎందుకంటే వారు అప్పటికప్పు
ఆన్ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్లతో కలిసి పనిచేస్తాడు
అయితే దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రయోగాత్మకంగా ముస్తాక్ అలీ ట్రోఫీలో పరిశీలించాలని బీసీసీఐ భావిస్తోంది. 'మ్యాచ్ల్లో ఎలాంటి తప్పుడు నిర్ణయాలూ వెలువడకుండా చూడాలనుకుంటున్నాం. వచ్చే సీజన్లో రెగ్యులర్ అంపైర్లతో పాటు నోబాల్స్ను పర్యవేక్షించేందుకు మరో ప్రత్యేక అంపైర్ కూడా కనిపిస్తాడు. ప్రత్యేక అంపైర్ ఆన్ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్లతో కలిసి పనిచేస్తాడు. ఈ ఆలోచన కాస్త విచిత్రంగా కనిపించినా.. మా మధ్య దీనిపై చర్చ జరిగింది' అని పాలక మండలి సభ్యుడు ఒకడు తెలిపారు.