ఆరు వారాల సుదీర్ఘ పర్యటనలో
ఆరు వారాల సుదీర్ఘ పర్యటనలో భాగంగా కోహ్లీసేన న్యూజిలాండ్లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. ఐదు టీ20ల సిరిస్లో భాగంగా న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య తొలి టీ20 శుక్రవారం శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైంది.
టాస్ గెలిచిన టీమిండియా
ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కివీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. మరోవైపు భారత యువ జట్టు అండర్ 19 ప్రపంచకప్లో భాగంగా మధ్యాహ్నం 1.30 నుంచి న్యూజిలాండ్తో తలపడనుంది. ఈ మెగా టోర్నీలో భారత యువ జట్టు ఇప్పటికే శ్రీలంక, జపాన్పై విజయం సాధించింది.
న్యూజిలాండ్-ఎ జట్టుతో భారత్-ఎ జట్టు
దీంతో పాటు న్యూజిలాండ్-ఎ జట్టుతో భారత్-ఎ జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్ శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటలకే ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. జార్జ్ (135) సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో ఇషాన్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు.
ఒకేరోజు మూడు మ్యాచ్లు
* New Zealand vs India, 1st T20I: From 12:20 PM IST in Auckland
* New Zealand A vs India A, 2nd unofficial ODI: From 03:30 AM IST in Christchurch
* U19 World Cup, India vs New Zealand: From 01:30 PM IST in Bloemfontein