గంగూలీ మాట్లాడుతూ
ది వీక్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్యూలో గంగూలీ మాట్లాడుతూ "పింక్ బాల్ టెస్టుక్ హాజరైన అభిమానులను చూసి ఆనందమేసింది. ముందుకెళ్లడానికి ఇదే సరైన మార్గం. సిరీస్లో ఓ డే నైట్ టెస్టు మ్యాచ్ ఉంటే బాగుంటుంది. నా అనుభవాలను బోర్డు సభ్యులతో పంచుకుంటా. ఇతర వేదికల్లో కూడా పింక్ బాల్ టెస్టుని జరిపించేందుకు మేం ప్రయత్నిస్తాం" అని అన్నాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా
"ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ తర్వాత అంతా సిద్ధమయ్యారు. 5000 వేల మంది ముందు టెస్టు క్రికెట్ ఆడాలని ఎవరూ కోరుకోరు" అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి డే నైట్ టెస్టు మ్యాచ్కు నాలుగు రోజుల టికెట్లు ముందుగానే అమ్ముడయ్యాయి.
పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు
అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే, కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం డే నైట్ టెస్టు బాగుందని అయితే ప్రతి టెస్టును అలా ఆడలేమని చెప్పడం విశేషం. ఈ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మూడు రోజుల్లోనే ముగించిన టీమిండియా
ఐదు రోజుల పాటు జరగాల్సిన మ్యాచ్ని కోహ్లీసేన కేవలం మూడు రోజుల్లోనే ముగించి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఈ క్రమంలో టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా నాలుగో ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.