ప్రస్తుతం యుఎస్లో ఉన్నానని మీకు తెలుసు
"నేను ప్రస్తుతం యుఎస్లో ఉన్నానని మీకు తెలుసు, నేను స్పందించిన ఏకైక విషయం గంగూలీ నామినేషన్. అతని ఎన్నిక చాలా సంతోషకరమైన పరిణామం అవుతుంది. అంతేకాదు గతం గురించి నాకు తెలియదు. భవిష్యత్వైపే తన దృష్టి" అని ఆయన వెల్లడించారు. గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవికి సోమవారం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అధ్యక్ష బరిలో గంగూలీ ఒక్కడే
ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడి హోదాలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అధ్యక్ష బరిలో గంగూలీ ఒక్కడే పోటీ చేస్తుండటంతో అతడి ఎన్నిక లాంఛనమే. అక్టోబర్ 23న గంగూలీ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 2020 వరకు దాదా ఈ పదవిలో కొనసాగనున్నాడు.
సంతోషం వ్యక్తం చేసిన గంగూలీ
గంగూలీ నామినేషన్ సందర్భంగా అతడి వెంట బీసీసీఐ మాజీ అధ్యక్షులు నిరంజన్ షా, ఎన్ శ్రీనివాసన్, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లాలు ఉన్నారు. నామినేషన్ అనంతరం గంగూలీ మాట్లాడుతూ బీసీసీఐ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టానికి తాను సిద్ధంగా ఉండటమే కాకుండా, సంతోషంగా కూడా ఉన్నానని ఈ సందర్భంగా గంగూలీ తెలిపాడు.
ఈ పదవిని నేను ఎప్పుడూ ఆశించలేదు
"ఈ పదవిని నేను ఎప్పుడూ ఆశించలేదు. కనీసం ఎవరితోనూ చెప్పలేదు. ఆదివారం రాత్రి 10:30 వరకు కూడా ఈ విషయం నాకు తెలియదు. అప్పుడే చెప్పారు నువ్వే బీసీసీఐ ప్రెసిడెంట్ కావాలని. దేశం కోసం ఆడాను, సారథిగా కూడా బాధ్యతలు చేపట్టాను, గత మూడేళ్ల నుంచి బీసీసీఐ పనితీరు సరిగా లేదు. ఇలాంటి సందర్భంలో బాధ్యతలు స్వీకరించడం గొప్ప అవకాశమే" అని గంగూలీ అన్నాడు.
మళ్లీ భారత క్రికెట్కు పూర్వవైభవం తీసుకొస్తాం
"బీసీసీఐలో పరిస్థితులు చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. మరికొన్ని నెలల్లో అన్ని వ్యవస్థలు ప్రక్షాళన చేసి.. మళ్లీ భారత క్రికెట్కు పూర్వవైభవం తీసుకొస్తాం. ఏకపక్షంగా గెలవడం ముఖ్యం కాదు అని, ప్రపంచ క్రికెట్లోనే బీసీసీఐ అతిపెద్ద సంస్థ అని, దాని బాధ్యతలు చూసుకోవడం ముఖ్యం. ఆర్థికపరంగా బీసీసీఐ కీలకమైంది, అలాంటి సంస్థకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం సవాలే" అని గంగూలీ పేర్కొన్నాడు.