భువీ స్థానంలో శార్దుల్ ఠాకూర్
అతడి స్థానంలో శార్దుల్ ఠాకూర్ జట్టులో చోటు సాధించినట్లు శనివారం బీసీసీఐ పేర్కొంది. భువీ గాయంపై బౌలింగ్ కోచ్ అరుణ్ అరుణ్ మాట్లాడుతూ "భువీ గాయంపై ఫిజియో పరీక్షలు నిర్వహిస్తున్నాడని, నివేదిక రాగానే అతడి గాయంపై స్పష్టత వస్తుంది" అని పేర్కొన్నాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే ఆదివారం చెన్నై వేదికగా జరగనుంది.
చివరగా 2018లో
భువీ స్థానంలో ఉమేశ్ను ఎంపిక చేస్తారని భావించినప్పటికీ శార్దూల్ వైపై బీసీసీఐ మొగ్గు చూపింది. శార్దుల్ ఠాకూర్ చివరగా 2018లో ఆడాడు. అనంతరం గాయం కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
విండిస్తో మూడు వన్డేల సిరిస్కు జట్టు :
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్పంత్(వికెట్ కీపర్), శివం దూబే, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, కులదీప్ యాదవ్, దీపక్ చాహర్, మహమ్మద్ షమీ, శార్దుల్ ఠాకూర్