న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'Pulwama Shaheeds': సోషల్ మీడియాలో వైరల్ అయిన సెహ్వాగ్ ట్వీట్

Sehwag Wins Praises for Training Kids of Pulwama Shaheeds at His School

హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడిలో సుమారు నలభైకు పైగా జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అమర జవాన్లలో కొందరి పిల్లలకు సెహ్వాగ్‌ తన అంతర్జాతీయ స్కూల్‌లో ఉచితంగా చదువు చెప్పిస్తున్నాడు.

ఈ క్రమంలో ఓ పిల్లాడు క్రికెట్‌ శిక్షణ పొందుతున్న ఫోటోలను సెహ్వాగ్ తన ట్విట్టర్‍‌లో పోస్టు చేస్తూ "హీరోల కుమారులు. నా స్కూల్‌లో ఈ చిన్నారులకు సేవలు అందించడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నా. బ్యాట్స్‌మన్ - అర్పిత్ సింగ్ s/o అమర జవాన్ రామ్‌ వకీల్‌ కుమారుడు కాగా, బౌలర్‌ - రాహుల్‌ సోరెంగ్‌ s/o అమర జవాన్ విజయ్‌ సోరెంగ్‌ కుమారుడు). కొన్ని విషయాలు ఆనందాన్ని ఇస్తాయి" అని ట్వీట్ చేశాడు.

శార్ధూల్ బర్త్ డే రోజున జెర్సీ NO.10 వివాదాన్ని గుర్తు చేసిన రోహిత్ శర్మశార్ధూల్ బర్త్ డే రోజున జెర్సీ NO.10 వివాదాన్ని గుర్తు చేసిన రోహిత్ శర్మ

సెహ్వాగ్‌ చేసిన ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరులకు ఎంతో కొంత తిరిగి ఇవ్వడం మన విధి మీరు గొప్ప వారు సర్‌" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... మరొక నెటిజన్ "సర్, మీరు గొప్ప వ్యక్తి, మంచి పని చేస్తున్నారు, అందుకే మీకు సెల్యూట్ చేస్తున్నా" అని ట్వీట్ చేశాడు.

India vs South Africa, 3rd Test: 5000 టికెట్లు వారికి మాత్రమే ఉచితం!India vs South Africa, 3rd Test: 5000 టికెట్లు వారికి మాత్రమే ఉచితం!

Story first published: Thursday, October 17, 2019, 19:44 [IST]
Other articles published on Oct 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X