ఇది నా మొదటి యూకే పర్యటన
ఈ సందర్భంగా కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ "ఇది నా మొదటి యూకే పర్యటన. మంచి ఆరంభం దక్కింది. ఈరోజు ప్రదర్శన సంతృప్తికరంగా ఉంది. భిన్న శైలిలో సరైన ప్రదేశాల్లో బంతులేయడానికి ప్రయత్నించాను. మ్యాచ్ ప్రారంభానికి ముందు నేను, చాహల్ బౌలింగ్ ఎలా వేయాలన్న దాని గురించి చాలా చర్చించుకున్నాం" అని అన్నాడు.
చాహల్ నా కంటే ముందు బౌలింగ్ చేశాడు
"ఈ మ్యాచ్లో చాహల్ నా కంటే ముందు బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత నా వద్దకు వచ్చి పిచ్ కొంచెం నెమ్మదిగా ఉంది" అని చెప్పాడు. అందుకు తగ్గట్టుగా బౌలింగ్ చేశా. భిన్న శైలిలో బంతులేస్తే మా బౌలింగ్ను ఎదుర్కోవడం ఇంగ్లాండ్కు కూడా కష్టతరంగా ఉంటుంది" అని కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు.
76 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో కోహ్లీసేన 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ఓపెనర్లు రోహిత్ శర్మ (9), శిఖర్ ధావన్ (74) దూకుడుగా ఆడటంతో 5 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్.. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ను 132/9కే ఆలౌట్ చేసింది.
స్ఫిన్నర్ల ధాటికి ఏ దశలోనూ కోలుకోలేకపోయిన ఐర్లాండ్
భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/21), చాహల్ (3/38) ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఓపెనర్ జేమ్స్ (60) కాసేపు క్రీజులో నిలిచి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా, కుల్దీప్ అతడిని పెవిలియన్కు చేర్చడంతో ఐర్లాండ్ ఓటమిపాలైంది. రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం రాత్రి 8.30 గంటలకి జరగనుంది.