|
టీ20ల్లో 100సార్లు ఓడిన మూడో జట్టుగా
దీంతో టీ20ల్లో 100సార్లు ఓడిన మూడో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఇంగ్లాండ్కు చెందిన మిడిలెక్స్ (112 మ్యాచ్లు), డెర్బీషైర్(101 మ్యాచ్లు) జట్లు ఈ జాబితాలో మొదటి, రెండో స్థానంలో ఉన్నాయి. మరోవైపు ఆర్సీబీ ఓడిన 90 మ్యాచ్లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉండటం విశేషం.
ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
మరోవైపు ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి ఏడేళ్ల ఏళ్ల తర్వాత ఐపీఎల్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్టు ఏదైనా ఉందంటే అది ఆర్సీబీ మాత్రమే. ఈ సీజన్లో ఆర్సీబీ ఆడిన మొదటి ఆరు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది.
వరుసగా అత్యధిక మ్యాచ్ల్లో ఓడిన జట్టు
ఈ క్రమంలో ఐపీఎల్లో వరుసగా అత్యధిక మ్యాచ్ల్లో ఓడిన జట్టు రికార్డుని కూడా ఆర్సీబీ సమం చేసింది. 2013 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్డేవిల్స్(ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) వరుసగా ఆరు సార్లు ఓడిపోయింది. ఈ సీజన్లో తొలి ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం ఒకే దాంట్లో గెలిచి.. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలతో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకున్న ఆర్సీబీ కీలక మ్యాచ్లో తడబడింది.
ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తొలి జట్టుగా ఆర్సీబీ
దీంతో ఈ సీజన్లో ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బెంగళూరు 7 వికెట్లకు 171 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో పార్థివ్ పటేల్ (39), స్టాయినిస్ (32 నాటౌట్) మాత్రమే ఫరవాలేదనిపించారు.