తీవ్ర ఒత్తిడిలో కూడా
తొలి టెస్టు తీవ్ర ఒత్తిడిలో కూడా రహానే తొలి ఇన్నింగ్స్లో 81, రెండో ఇన్నింగ్స్లో 102 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక, విహారి సైతం తొలి ఇన్నింగ్స్లో 32, రెండో ఇన్నింగ్స్లో 93 పరుగులతో రాణించాడు. దీంతో తొలి టెస్టులో టీమిండియా 318 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
నన్ను ఆశ్చర్యపరచలేదు
"అత్యంత ఒత్తిడిలో ఆడిన రహానె ఇన్నింగ్స్ నన్ను ఆశ్చర్యపరచలేదు. వ్యక్తిగతంగానే కాకుండా జట్టు పరంగా అతడిది అవసరమైన ప్రదర్శన. ఇక గెలిచే మ్యాచ్లో అయితే అంతకన్నా మించింది ఏముంటుంది" అని గంభీర్ అన్నాడు. మరోవైపు సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా ఎదరుచూడక తప్పదని గంభీర్ చెప్పాడు.
రెండో స్థానంపై కన్నేసిన బెంగాల్... గెలుపు రుచి కోసం తమిళ తలైవాస్
పంత్ యావరేజి బ్యాటింగ్లో
"పంత్ యావరేజి బ్యాటింగ్లో 48(నిజానికి 45.43గా ఉంది) ఉన్నప్పుడు సాహా ఎదురు చూడక తప్పదు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో సెంచరీలతో మెరుగైన ప్రదర్శన చేశాడు. దీంతో టెస్టుల్లో ఆడేందుకు అతడే (పంత్) అర్హుడు. వచ్చిన అవకాశాన్ని పంత్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు" అని గంభీర్ వెల్లడించాడు.
రెండు రోజుల క్రితం పంత్కు
ఇదిలా ఉంటే, రెండు రోజుల క్రితం పంత్కు అవకాశాలు కల్పించేందుకు సాహా కెరీర్ను పణంగా పెట్టడం సరైంది కాదని టీమిండియా మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్కు పదే పదే అవకాశాలిస్తున్న టీమిండియా మేనేజ్మెంట్.. వృద్ధిమాన్ సాహాను పట్టించుకోకపోవడంపై కూడా కిర్మాణి మండిపడ్డారు.