|
భువనేశ్వర్ బౌలింగ్లో చంద్రపాల్ కవర్స్ దిశగా:
కోహ్లీ కంటే వేగంగా పరిగెత్తి బంతిని అందుకున్నాడు. ఇలా కొందరు అంటుంటే ఇద్దరు కలిసి బౌండరీకి వెళ్లే బంతిని ఆపారని మరి కొందరు అంటున్నారు. ఇప్పుడు ఈ రేస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో వెస్టిండీస్ ఓపెనర్ చంద్రపాల్ హేమరాజ్ బంతిని కవర్స్ దిశగా హిట్ చేశాడు.
బౌండరీకి వెళ్తున్న దాన్ని నిలువరించేందుకు:
దీంతో.. జడేజా, విరాట్ కోహ్లి మధ్యలో పడిన బంతి బౌండరీకి వెళ్తుండగా.. దాన్ని నిలువరించేందుకు ఇద్దరూ ఒకేసారి పరుగు అందుకున్నారు. ఈ క్రమంలో కొన్ని క్షణాల పాటు ఇద్దరూ పక్కపక్కనే పోటాపోటీగా పరుగెత్తారు. అయితే.. మధ్యలో జోరుపెంచిన జడేజా.. కోహ్లీని దాటుకుని వెళ్లి కింద జారుకుంటూ బంతిని అందుకున్నాడు. అలా వెళ్తున్న బంతిని దాన్ని కోహ్లీకి అందించాడు. వెంటనే ఆ బంతిని ధోనీకి అందించారు.
50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377
మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. ఓపెనర్ రోహిత్ శర్మ (162: 137 బంతుల్లో 20ఫోర్లు, 4సిక్సులు), మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు (100: 81 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సులతో) సెంచరీలు సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు చేసింది.
153 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు 36.2 ఓవర్లలో 153 పరుగులకే పేలవరీతిలో కుప్పకూలిపోయింది. దీంతో.. ఐదు వన్డేల సిరీస్లో భారత్ జట్టు 2-1తో ఆధిక్యంలో నిలవగా.. తిరువనంతపురం వేదికగా గురువారం మధ్యాహ్నం ఐదో వన్డే జరగనుంది.