ఏడాది మిస్సయ్యింది 11వది
ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియాలో స్పిన్నర్ అద్భుత ప్రదర్శన చేసిన నాథన్ లయన్ టీమిండియా ఎనిమిది వికెట్లను పడగొట్టాడు. ఈ ఏడాది విదేశాల్లో జరిగిన టెస్టు మ్యాచ్లలో అశ్విన్ మిస్సయ్యిన వాటిలో ఇది 11వది. జోహన్నెస్బర్గ్ వేదికగా ఆడిన టెస్టులో భారత్ నలుగురు ఫేసర్లు అవసరమైన నేపథ్యంలో అశ్విన్ను దూరంగా పెట్టింది. సౌతాంప్టన్ టెస్టులోనూ ఫిట్నెస్ లోపంతో బాధపడుతుండటంతో జట్టుకు దూరమైయ్యాడు.
అడిలైడ్లో అదరగొట్టిన అశ్విన్
అడిలైడ్ ప్రదర్శన తర్వాత ఆడిన మ్యాచ్లలో టీమిండియాలో అతని లోటు కనిపిస్తోంది. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్ను కుప్పకూల్చి తన సత్తా చాటాడు. మార్కస్ హారిస్, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్లను బోల్తా కొట్టించి 87 పరుగులకే నాలుగు వికెట్లను పడగొట్టి కట్టడి చేశాడు. రెండో ఇన్నింగ్స్లోనూ రవిచంద్రన్ అశ్విన్ ఆరోన్ ఫించ్, ఖవాజాలను ఓడించి భారత్ను ముందుకు నడిపాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆఖరి వికెట్ను తీసి భారత్కు విజయాన్ని తెచ్చిపెట్టాడు.
అశ్విన్ గాయాలు బాధకు గురిచేశాయని
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడుతూ.. రవిచంద్రన్ అశ్విన్ గాయాలు తనను బాధకు గురిచేశాయని తెలిపాడు. అశ్విన్ ఫిట్నెస్ తప్పక కాపాడుకోవాలి. వరుసగా గాయాలపాలవడం తనను నిరాశకు గురిచేసిందంటూ పేర్కొన్నాడు.
జట్టుకు అవసరమైనప్పుడే అశ్విన్ దూరం
'రవిచంద్రన్ అశ్విన్ విషయంలో నేను చాలా బాధపడ్డాను. ప్రముఖమైన టెస్టులకు అశ్విన్ హాజరుకాలేకపోతున్నాడు. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలతో పాటు ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలోనూ అదే జరిగింది. జట్టుకు ఇప్పుడు తన అవసరం ఎంతగానో ఉంది. కానీ, అతను జట్టుకు దూరంగా ఉన్నాడు. తప్పిదాలను పునరావృతం చేయడం ఎంతమాత్రం మంచిది కాదు' అని గంగూలీ వెల్లడించాడు.