క్రికెట్ అంటే ఆసక్తా?: మైఖేల్లో ఐపీఎల్ ఫాంటసీ లీగ్ గురించి తెలుసుకోండి (వీడియో)


హైదరాబాద్: ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఇప్పుడు మీరూ ఐపీఎల్ ఆడొచ్చు. మీరెక్కడైనా ఉండి జట్టుతో పాటు మైదానంలో ప్రయాణించొచ్చు. కేవలం మ్యాచ్ను వీక్షిస్తూ ఏ జట్టు గెలవబోతుందో, ఏ ఆటగాడు బాగా రాణిస్తాడో ముందుగానే ఊహించి చెప్పి బహుమతులు కూడా గెలుచుకోవచ్చు. ఈ అవకాశాన్ని 'మైఖేల్ ఫాంటసీ క్రికెట్' మీకు అందిస్తోంది. ఈ క్రీడా సదుపాయాన్ని ప్రముఖ క్రీడా వెబ్సైట్ మైఖేల్.కామ్ మీకు చేరువ చేయనుంది.
బహుమతులు పొందడానికి త్వరపడి.. ఇప్పుడే రిజిష్టర్ అవ్వండి..

మ్యాచ్ ముగిసే సమయానికి ప్రైజ్:
ఏ రోజైతే మ్యాచ్ జరుగుతుందో.. ఆ రోజు ఇరు జట్లలోని 22 మంది ఆటగాళ్లలో మనకు నచ్చిన 11మందిని ఎంచుకోవాలి. మనం ఎంచుకున్న ఆటగాడి ప్రదర్శనను బట్టి పాయింట్లు పెరుగుతాయి. ఇలా నిర్దేశించిన జట్టు మినహాయించి మిగిలిన ఆటగాళ్ల కంటే స్కోరు ఎక్కువ సంపాదిస్తే మ్యాచ్ ముగిసే సమయానికి ప్రైజ్ గెలుచుకోవచ్చు.

భారీ సంఖ్యలో బహుమతులు
ఇలా ఒక్కో మ్యాచ్కు, వారాంతపు ఫలితాలకు, పూర్తి సీజన్కు కలిపి విడివిడిగా భారీ సంఖ్యలో బహుమతులను గెలుచుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది మైఖేల్. ఒక్కో ఆటగాడికి కేటాయించిన ధరను బట్టి జట్టును ఎంచుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మీ పదకొండు మంది ఆటగాళ్ల పేర్లను నమోదు చేసి రిజిష్టర్ చేసుకోవాలి.

పరుగులు తీస్తుంటే పాయింట్లు పెరుగుతూ:
రిజిష్టర్ అయిన తర్వాత మనకు చెందిన క్రికెటర్ పరుగులు తీస్తుంటే మన పాయింట్లు పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ అతను బౌండరీలను లేదా 25, 30, 50, 100 పరుగులు చేస్తుంటే.. వాటికి ప్రత్యేకంగా పెరుగుతాయి. ఇది బౌలర్ విషయానికొస్తే.. వికెట్ తీసినా, ఒక ఓవర్ మైడిన్ చేసినా లేదా ఉన్న ఎకానమీ రేట్ పెరగకుండా చూసినా అతను ప్రత్యేక పాయింట్లను తెచ్చిపెట్టినట్లన్న మాట. ఇలా చెప్పుకుంటూపోతే క్యాచ్, పట్టినందుకు, స్టప్ అవుట్ చేసినందుకు, కెప్టెన్ను, వైస్ కెప్టెన్ను ఎంచుకున్నందుకు పాయింట్లు పెరుగుతూనే ఉంటాయి.

మైఖేల్ సీఈవో అభిప్రాయం:
క్రీడా వెబ్సైట్ మైఖేల్.కామ్ సీఈవో శ్రీరామ్ హెబ్బర్ మాట్లాడుతూ.. 'క్రికెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందిన ఆట. అటువంటి క్రికెట్లోకి ఇలాంటి ఫాంటసీ కాన్సెప్ట్ను తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ఇప్పటికే ఆరు భాషల్లో క్రీడా వార్తలనందిస్తోన్న క్రీడా వెబ్సైట్ ఈ కార్యక్రమం ద్వారా మరింతగా ప్రజల్లోకి వెళుతుంది.' అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

క్రిక్ బాటిల్ యాజమాన్యం:
ఫాంటసీ క్రికెట్ను ప్రాంతాల వారీగా పరిచయం చేయబోతున్న క్రిక్ బాటిల్ యాజమాన్యం ఇలా స్పందించింది. ప్రముఖ క్రీడా వార్తల వెబ్సైట్ మైఖేల్తో కలిసి ప్రయాణిస్తున్నందుకు సంతోషంగా ఉందని క్రిక్ బాటిల్ సంస్థ సీఈవో రాకేష్ దేశాయ్ తెలిపారు. ఈ పద్ధతి ద్వారా ఆసక్తి ఉన్న వాళ్లు తమ జట్టుపై డబ్బును కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. తద్వారా ఇంకా ఎక్కువ మొత్తంలో పాయింట్లను కూడా గెలుచుకోవచ్చని పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications