ప్రవీణ్ ఆమ్రేకి బ్యాటింగ్ కోచింగ్ అనుభవం
దీంతో పాటు ప్రవీణ్ ఆమ్రేకి బ్యాటింగ్ కోచింగ్ అనుభవం కూడా ఉంది. 2012లో ఆమ్రే కోచింగ్ నేతృత్వంలోని అండర్-19 భారత జట్టు క్రికెట్ వరల్డ్కప్ను గెలుచుకుంది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, పూణె వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లకు సైతం బ్యాటింగ్ కోచ్గా వ్యవహారించాడు. దీంతో పాటు యుఎస్ఏ క్రికెట్కు బ్యాటింగ్ సలహాదారుగా కూడా పని చేస్తున్నారు. అంతేకాదు టీమిండియా క్రికెటర్లు అజ్యింకే రహానే, సురేశ్ రైనా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రాబిన్ ఊతప్ప వంటి వారికి బ్యాటింగ్ కోచ్గా చిట్కాలు నేర్పించారు.
బీసీసీఐ వర్గాల నుంచి వస్తున్న
మరోవైపు బీసీసీఐ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం భరత్ అరుణ్ను ఏకగ్రీవంగా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. "గత 18-20 నెలల్లో భరత్ అరుణ్ ఎంతో కష్టపడ్డాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ప్రస్తుతమున్న భారత బౌలింగ్ దాడే అత్యుత్తమం అని చెప్పొచ్చు. మహ్మద్ షమి గాడిలో పడేందుకు, జస్ప్రీత్ బుమ్రా నిలకడగా ఆడేందుకు అరుణ్ ఎంతో కృషి చేశాడు. కమిటీ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. కానీ అతడి స్థానాన్ని భర్తీ చేయడమైతే సులభమైతే కాదు" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ఆగస్టు 2014లో బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు
బంగర్ విషయంలో మాత్రం ఇలాంటి అభిప్రాయం లేదు. ఆగస్టు 2014లో బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ బంగర్ ఒకానొక సమయంలో హెడ్ కోచ్ రేసులో సైతం ఉన్నాడు. అయితే, 2016 జులైలో అనిల్ కుంబ్లేని హెడ్ కోచ్గా నియమించిన బీసీసీఐ.... బంగర్ను తిరిగి బ్యాటింగ్ కోచ్గా నియమించింది. ఆ తర్వాత రవిశాస్త్రి హయాంలో కూడా బంగర్ బ్యాటింగ్ కోచ్గా కొనసాగాడు.
సెమీస్లో టీమిండియా నిష్క్రమణ
ప్రపంచకప్ సెమీస్లో టీమిండియా నిష్క్రమణతో సంజయ్ బంగర్పై కత్తి వేలాడుతోంది. మిడిలార్డర్లో మెరుగైన బ్యాట్స్మెన్ను తయారు చేయడం అతడి బాధ్యత. కానీ, టీమిండియాను ఎప్పటినుంచో వేధిస్తోన్న నెంబర్.4 సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత కోచ్ల పదవీకాలం ముగిసినప్పటికీ వెస్టిండీస్ పర్యటనను దృష్టిలో పెట్టుకొని రవి శాస్త్రి, బంగర్, భరత్, శ్రీధర్ పదవీకాలాన్ని పొడగించారు.
జులై 30 ఐదు గంటల్లోగా దరఖాస్తులు
టీమిండియా హెడ్ కోచ్తో పాటు సపోర్టింగ్ స్టాఫ్కు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్ కోచ్తో పాటు బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్లు, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ను కొత్తగా తిరిగి నియమించనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్దులు జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని బీసీసీఐ పేర్కొంది.