నొచ్చుకోవద్దు..
ధోనీ వీడ్కోలు మ్యాచ్పై బీసీసీఐ తీరును తప్పుబడుతున్నందకు నొచ్చుకోవద్దన్నాడు. ‘నేనెప్పుడూ సానుకూల అంశాలు మాత్రమే మాట్లాడుతాను. నెగటివిటీని స్ప్రెడ్ చేయను. ఎవరిమీదా తప్పుగా మాట్లాడను. కానీ ధోనీ విషయంలో మాత్రం ఆగలేక ఇలా స్పందించాల్సి వస్తుంది. బీసీసీఐ ధోనీ వీడ్కోలు విషయంలో సరిగా ప్రవర్తించలేదు. అంత గొప్ప ఆటగాడికి సరైన పద్ధతిలో వీడ్కోలు పలకలేదు. ఇది ముమ్మాటికి బీసీసీఐ వైఫల్యమే. అతని వీడ్కోలు ఇలా ఉండాల్సింది కాదు. ఇది నా మనసులో నుంచి వచ్చిన మాట. ధోనీ కోట్లాది మంది అభిమానులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు. ఇలా అంటున్నందుకు బీసీసీఐకి క్షమాపణలు. కానీ మీ తీరుతో నేను బాధపడ్డా.'అని సక్లైన్ ముస్తాక్ చెప్పుకొచ్చాడు.
సక్లైన్ తీరు బాలేదు
అయితే ధోనీని ప్రశంసిస్తూ.. బీసీసీఐపై విమర్శలు గుప్పించడంపై పీసీబీ ఆగ్రహంగా ఉన్నట్లు ఆ బోర్డు వర్గాలు తెలిపాయి. భారత్తో సత్సంబంధాలు బాలేని సమయంలో ఆ జట్టు క్రికెటర్లు, బోర్డు గురించి మాట్లేడటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే పీసీబీ తమ ఆటగాళ్లకు స్పష్టం చేసింది. ‘ధోనీని ప్రశంసిస్తూ.. బీసీసీఐపై విమర్శలు గుప్పించిన సక్లైన్ తీరుపై పీసీబీ అసంతృప్తిగా ఉంది. ధోనీకి గ్రాండ్ ఫెర్వెల్ ఇవ్వకపోవడం గురించి సక్లెయిన్ ప్రస్తావించడం బాలేదు'అని ఓ పీసీబీ అధికారి మీడియాకు తెలిపారు.
యూట్యూబ్ చానెళ్లపై ఆంక్షలు..
పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు చాలా మంది యూట్యూబ్ చానెళ్లు నడిపిస్తున్నారు. తమ చానెల్ వేదికగా క్రికెట్కు సంబంధించిన విషయాలపై స్పందిస్తున్నారు. అయితే ఎక్కువ భారత క్రికెట్ వ్యవహారాలపైనే ఆసక్తికనబరుస్తున్నారు. ఇది తమకు సమస్యకు మారుతుందని భావించిన పీసీబీ.. బోర్డుతో కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లు, కోచ్లు యూట్యూబ్ చానళ్లు నిర్వహించడానికి వీలు లేదని ఆదేశాలిచ్చిందంట. అంతేకాకుండా ఏ ఆటగాడైనా.. కోచ్ అయినా ఇంటర్వ్యూ ఇవ్వాలంటే బోర్డు అనుమతి తీసుకోవాలని సూచించిందంట.