డి సిల్వా శతకం:
ఐదవ రోజు ఓవర్నైట్ స్కోరు 282/6తో చివరి రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 6 వికెట్లకు 308 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ధనంజయ డి సిల్వా (102 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ సెంచరీ చేశాడు. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (50) హాఫ్ సెంచరీ చేయగా.. ఓషాడా ఫెర్నాండో (40) రాణించాడు. షాహీన్ అఫ్రిది, నసీమ్ షా తలో రెండు వికెట్లు తీశారు.
ఆబిద్ అలీ సెంచరీ:
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి 70 ఓవర్లలో 2 వికెట్లకు 252 పరుగులు చేసింది. అరంగేట్ర ఆటగాడు ఆబిద్ అలీ (109 నాటౌట్; 11 ఫోర్లు), మిడిలార్డర్ బ్యాట్స్మన్ బాబర్ ఆజమ్ (102 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీలతో అలరించారు. ఫలితంగా వర్షప్రభావిత మ్యాచ్ డ్రాగా ముగిసింది.
తొలి క్రికెటర్గా రికార్డు:
సెంచరీ చేసిన ఆబిద్ అలీ అరుదైన ఘనత సాధించాడు. పురుషుల క్రికెట్లో టెస్టు, వన్డే అరంగేట్ర మ్యాచ్ల్లో సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్మన్గా రికార్డుల్లో నిలిచాడు. 32 ఏళ్ల లేటు వయసులో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన అబిద్.. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాపై ఆడిన తొలి వన్డేలోనూ సెంచరీ (112) చేసాడు. తొలి వన్డేలోనే సెంచరీ బాదిన 15వ బ్యాట్స్మన్గా కూడా నిలిచాడు.
మహిళల క్రికెట్లో బేక్వెల్:
మహిళల క్రికెట్లో ఇంగ్లండ్కు చెందిన ఎనిడ్ బేక్వెల్ టెస్టు, వన్డేల్లో అరంగేట్ర మ్యాచ్ల్లో సెంచరీలు చేసింది. బేక్వెల్ తొలి టెస్టు (1968లో ఆ్రస్టేలియాపై 113)లో, తొలి వన్డేలో (1973లో ఇంటర్నేషనల్ ఎలెవన్పై 101 నాటౌట్) సెంచరీలు చేసి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా రికార్డు పుటల్లోకి ఎక్కింది.