హైదరాబాద్: 10 ఏళ్ల తర్వాత పాకిస్థాన్లో టెస్టు మ్యాచ్ నిర్వహించేందుకు ఆ దేశ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్లో రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం శ్రీలంక జట్టు పాకిస్థాన్లో పర్యటించనుంది.
ఈ పర్యటనలో భాగంగా డిసెంబర్ 11 నుంచి 15 వరకూ రావల్పిండిలో తొలి టెస్టు జరుగనుండగా, డిసెంబర్ 19నుంచి 23 వరకూ కరాచీలో రెండో టెస్టు జరుగనుంది. వాస్తవానికి, శ్రీలంక ఈ ఏడాది అక్టోబర్లో టెస్టు సిరిస్ ఆడాలి. ఆ తర్వాత మళ్లీ డిసెంబరులో వైట్ బాల్ క్రికెట్ కోసం తిరిగి రావాల్సి ఉంది.
గంగూలీని చూసి భయపడ్డావ్: రవిశాస్త్రి బౌలింగ్పై నెటిజన్ల జోకులు!
టెస్ట్ వేదికలను నిర్ణయించే ముందు పరిస్థితిని అంచనా వేయడానికి గాను ఈ మ్యాచ్ షెడ్యూల్ను మార్చడం జరిగింది. కాగా, పాక్లో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రొగ్రామ్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు లంక బోర్డు వెల్లడించింది.
2009లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏ దేశం కూడా పాక్ పర్యటనకు వెళ్లేందుకు సాహాసించలేదు. ఇటీవలే శ్రీలంక ద్వితీయ శ్రేణి జట్టు మూడు టీ20ల సిరిస్ కోసం పాక్లో పర్యటించింది. ఈ పర్యటనకు శ్రీలంక సీనియర్ క్రికెటర్లు దూరమైనప్పటికీ ద్వితీయ శ్రేణి జట్టు సిరిస్ను క్లీన్ స్వీప్ చేసింది.
After more than 10 years, Test cricket will return to Pakistan in December when Sri Lanka will play their World Test Championship matches in Rawalpindi and Karachi.
— Pakistan Cricket (@TheRealPCB) November 14, 2019
🏏 1st Test
📅 11-15 December
🏟 Pindi Cricket Stadium
🏏 2nd Test
📅 19-23 December
🏟 National Stadium https://t.co/UejLVK9OPo
పాక్తో టెస్టు సిరిస్కు ఆసీస్ జట్టిదే: మానసిక సమస్యతో తప్పుకున్న పుకౌస్వి, అసలేం జరుగుతోంది?
టెస్టు మ్యాచ్ షెడ్యూల్:
11-15 December 1st Test, Pindi Cricket Stadium, Rawalpindi
19-23 December 2nd Test, National Stadium, Karachi