చికిత్స అనంతరం రిచర్డ్స్ రెండో సెషన్లో
చికిత్స అనంతరం రిచర్డ్స్ రెండో సెషన్లో సహచర వ్యాఖ్యాతలతో కలిసిపోయాడు. ఈ సందర్భంగా రిచర్డ్స్ మాట్లాడుతూ "ప్రపంచవ్యాప్తంగా అభిమానులందరికీ మనవి నేను కోలుకున్నాను. కామెంటరీకీ తిరిగి వచ్చాను. ప్రపంచంలో ఏ బౌలర్ నన్ను భయపెట్టలేదు కానీ ఆ పని ప్రకృతి చేసింది. ఏది ఏమైనా మనం ప్రకృతిని గౌరవించాల్సిందే" అని అన్నాడు.
|
ఆసక్తికరంగా సాగుతోన్న రెండో టెస్టు
ఇదిలా ఉంటే, జమైకాలోని కింగ్స్టన్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మయాంక్ అగర్వాల్(55), విరాట్ కోహ్లీ(76) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలిరోజు ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.
క్రీజులో విహారి(42), పంత్(27)
క్రీజులో హనుమ విహారి(42), రిషబ్ పంత్(27) పరుగులతో ఉన్నారు. వెస్టిండిస్ బౌలర్లలో జాసన్ హౌల్డర్కు మూడు, కీమర్ రోచ్, కార్న్వాల్ తలో వికెట్ తీసుకున్నారు. టీమిండియా ఎలాంటి మార్పులు చేయకుండా తొలి టెస్టులో నెగ్గిన జట్టుతోనే బరిలోకి దిగింది. దీంతో వరుసగా రెండో మ్యాచ్లోనూ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు చోటు దక్కలేదు.
తొలి మ్యాచ్లో ఫరవాలేదనిపించిన భారీకాయుడు
మరోవైపు వెస్టిండిస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన వికెట్ కీపర్ షై హోప్ స్థానంలో జహ్మర్ హామిల్టన్ జట్టులోకి రాగా... ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసిన భారీకాయుడు రకీమ్ కార్న్వాల్ ఓ వికెట్తో పాటు 2 క్యాచ్లు అందుకున్నాడు. ఆరున్నర అడుగులు, 140 కిలోల బరువున్న కార్న్వాల్ తొలి మ్యాచ్లోనే చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చాడు.