అసలేం జరిగింది?
ఎఫ్టీపీ (ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం)లో భాగంగా వచ్చే ఏడాది జనవరిలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత్లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు పర్యటించాల్సి ఉంది. అయితే, ప్రసారదారుల ఒత్తిడితో ఈ సిరీస్ను ఎలాగైనా వాయిదా వేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. అయితే, ఇందుకు బీసీసీఐ ససేమిరా అనడంతో ఆసీస్ మహిళా క్రికెటర్లను ఐపీఎల్కు తమ ఆటగాళ్లను పంపకుండా బీసీసీఐపై ఒత్తిడి పెంచాలనే ప్రయత్నం చేస్తోంది.
బీసీసీఐకి క్లార్క్ మెయిల్
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిణి బెలిందా క్లార్క్ బీసీసీఐకి ఈమెయిల్ పంపారు. "ఎఫ్టీపీ ప్రకారం 2020లో ఆడాల్సిన సిరీస్కు సంబంధించిన సమస్య పరిష్కారమైతే మా మహిళా క్రికెటర్లను ఐపీఎల్కు పంపడంపై నిర్ణయం తీసుకోగలుగుతాం" అని మెయిల్లో క్లార్క్ పేర్కొంది.
షరతులు పెట్టడంపై బీసీసీఐ ఆగ్రహం
మహిళా క్రికెటర్లకు అనుమతిచ్చేందుకు ఇలా షరతులు పెట్టడమేంటని సీఏపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. పురుషుల క్రికెట్కు మహిళా ఐపీఎల్కు ముడిపెట్టడం ఏమిటని నిలదీసింది. "క్లార్క్ ఈమెయిల్ చూస్తే వాళ్లు బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మహిళా ప్లేయర్లను పంపడానికి, పురుషుల సిరీస్కు సంబంధమేంటి? ఎఫ్టీపీ ప్రకారం ఆ సిరీస్ జరగాల్సివుంది. సిరీస్పై వాళ్లిప్పుడు వెనుకంజవేస్తున్నారు" అని ఓ బీసీసీఐ అధికారి అన్నాడు.
మహిళల ఐపీఎల్లో ముగ్గురు క్రికెటర్లు
కాగా, ఐపీఎల్ టోర్నీలో భాగంగా మహిళల ఐపీఎల్ను మే 6 నుంచి 11 వరకు జైపూర్ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. మహిళల ఐపీఎల్లో ముగ్గురు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు లానింగ్, ఎలిస్ పెర్రీ, అలిసీ హీలీలు ఆడాల్సి ఉంది. ఈ ముగ్గురిని ఐపీఎల్ కోసం వారిని భారత్ పంపాల్సిందిగా బీసీసీఐ కోరడంతో సీఏ ఇలా బ్లాక్మెయిలింగ్కు పాల్పడింది.